• Home » Cricket news

Cricket news

Ashes DRS Controversy: యాషెస్ సిరీస్‌లో స్నికో మీటర్‌ వివాదం.. స్పందించిన ఐసీసీ

Ashes DRS Controversy: యాషెస్ సిరీస్‌లో స్నికో మీటర్‌ వివాదం.. స్పందించిన ఐసీసీ

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటలో డిసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) వివాదం చోటుచేసుకుంది. దీనిపై ఐసీసీ స్పందించింది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీకి సంబంధించిన డీఆర్ఎస్ విషయంలో సాంకేతిక లోపం జరిగిందని ఐసీసీ అంగీకరించింది.

Tom Latham record: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ప్లేయర్లు.. ప్రపంచ రికార్డు

Tom Latham record: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ప్లేయర్లు.. ప్రపంచ రికార్డు

న్యూజిలాండ్‌ స్టార్లు ప్లేయర్లు టామ్‌ లాథమ్‌, డెవాన్‌ కాన్వేలు 95 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్‌ జోడీగా నిలిచారు. వెస్టిండీస్‌తో గురువారం ప్రారంభమైన మూడో టెస్ట్ సందర్భంగా ఈ ఘనత సాధించారు.

IND vs SA: టాస్ పడకుండానే నాలుగో టీ20 మ్యాచ్ రద్దు..

IND vs SA: టాస్ పడకుండానే నాలుగో టీ20 మ్యాచ్ రద్దు..

భారత్, సౌతాఫ్రికా జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ టాస్ పడకుండానే రద్దైంది. పొగమంచు కారణంగా మ్యాచ్ ప్రారంభం కాకుండానే ముగిసింది. లక్నో నగరంతో పాటు మ్యాచ్ జరిగే స్టేడియాన్ని పొగమంచు కమ్మేయడంతో పలుమార్లు మైదానానికి వచ్చిన అంపైర్లు.. పరిస్థితిని పర్యవేక్షించి.. చివరకు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Pappu Yadav Son IPL: ఐపీఎల్2026లోకి ఎంపీ కొడుకు..  ధర ఎంతంటే..

Pappu Yadav Son IPL: ఐపీఎల్2026లోకి ఎంపీ కొడుకు.. ధర ఎంతంటే..

ఐపీఎల్2026 మినీ వేలం పలువురు ప్లేయర్లకు కాసుల పంట పండించింది. ఈ వేలంతో ఓ ఎంపీ కొడుకు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ వేలంలో భార‌త అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్ల కోసం కూడా కోల్‌కతా జట్టు త‌మ ప‌ర్స్‌లో ఉన్న మొత్తాన్ని వెచ్చింది. ఆ జట్టు కొనుగోలు చేసిన‌ మొత్తం 13 మంది ఆట‌గాళ్లలో స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ కుమారుడు సార్థక్ రంజన్ కూడా ఉన్నాడు.

Ashes 2026:నల్ల బ్యాడ్జీలతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ క్రికెటర్లు.. కారణం ఇదే..!

Ashes 2026:నల్ల బ్యాడ్జీలతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ క్రికెటర్లు.. కారణం ఇదే..!

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బోండీ బీచ్‌లోరెండు రోజుల క్రితం యూదుల హనుక్కా వేడుక లక్ష్యంగా ఇద్దరు దుండగలు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడి.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్లు ధరించారు.

Cameroon Green: ఐపీఎల్ వేలంలో రూ.25 కోట్లు.. యాషెస్‌లో డకౌట్

Cameroon Green: ఐపీఎల్ వేలంలో రూ.25 కోట్లు.. యాషెస్‌లో డకౌట్

ఐపీఎల్‌ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ భారీ ధర పలికి వార్తల్లో నిలిచాడు. అతన్ని రూ.25.20 కోట్లకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సొంతం చేసుకుంది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే యాషెస్‌ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌ అతడు డకౌట్‌ అయ్యాడు.

IPL auction 2026: అన్‌క్యాప్‌డ్ ఆల్ రౌండర్లకు డిమాండ్.. భారీ ధర పలికిన ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ

IPL auction 2026: అన్‌క్యాప్‌డ్ ఆల్ రౌండర్లకు డిమాండ్.. భారీ ధర పలికిన ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ

ఐపీఎల్-2026 మినీ వేలంలో పలువురు అన్‌క్యాప్‌డ్ ఆల్ రౌండర్లు జాక్‌పాట్ కొట్టారు. పలువురు ఆటగాళ్లు వేలంలో భారీ ధర దక్కించుకున్నారు. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ప్రశాంత్ వీర్ కోసం ముంబై, లఖ్‌నవూ, చెన్నై, రాజస్థాన్ పోటీపడ్డాయి.

U19 Asia Cup 2025: 315 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

U19 Asia Cup 2025: 315 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

అండర్‌-19 ఆసియా కప్‌ 2025లో భాగంగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో యువ భారత్ 315 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు చేసింది. మలేషియా 93 పరుగులకే ఆలౌటైంది.

IPL Auction 2026: కామెరూన్ గ్రీన్‌కు భారీ ధర.. ఎన్ని కోట్లంటే?

IPL Auction 2026: కామెరూన్ గ్రీన్‌కు భారీ ధర.. ఎన్ని కోట్లంటే?

అందరూ ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఐపీఎల్ 2026 మినీ వేలంలో భారీ ధర పలికాడు. కనీస ధర రూ.2 కోట్లు ఉన్న అతడిని దక్కించుకోవడం కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి. చివరకు కేకేఆర్ గ్రీన్‌ను రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్‌ రికార్డు సృష్టించాడు.

Abhijnaan Kundu: అభిజ్ఞాన్‌ కుందు డబుల్‌ సెంచరీ.. తొలి ప్లేయర్‌గా రికార్డ్

Abhijnaan Kundu: అభిజ్ఞాన్‌ కుందు డబుల్‌ సెంచరీ.. తొలి ప్లేయర్‌గా రికార్డ్

అండర్ 19 ఆసియా కప్ లో భాగంగా మలేషియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీ చేశాడు. దీంతో అండర్ 19లో ద్విశతకం సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా ఈ 17 ఏళ్ల కుర్రాడు రికార్డు క్రియేట్ చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి