Home » Cricket news
ఐపీఎల్-2026 మినీ వేలంలో పలువురు అన్క్యాప్డ్ ఆల్ రౌండర్లు జాక్పాట్ కొట్టారు. పలువురు ఆటగాళ్లు వేలంలో భారీ ధర దక్కించుకున్నారు. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ప్రశాంత్ వీర్ కోసం ముంబై, లఖ్నవూ, చెన్నై, రాజస్థాన్ పోటీపడ్డాయి.
అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా మలేషియాతో జరిగిన మ్యాచ్లో యువ భారత్ 315 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు చేసింది. మలేషియా 93 పరుగులకే ఆలౌటైంది.
అందరూ ఊహించినట్లుగానే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ ఐపీఎల్ 2026 మినీ వేలంలో భారీ ధర పలికాడు. కనీస ధర రూ.2 కోట్లు ఉన్న అతడిని దక్కించుకోవడం కోసం కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడ్డాయి. చివరకు కేకేఆర్ గ్రీన్ను రూ.25.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డు సృష్టించాడు.
అండర్ 19 ఆసియా కప్ లో భాగంగా మలేషియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీ చేశాడు. దీంతో అండర్ 19లో ద్విశతకం సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ గా ఈ 17 ఏళ్ల కుర్రాడు రికార్డు క్రియేట్ చేశాడు.
ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న వైస్-కెప్టెన్ శుభ్మన్ గిల్కు విశ్రాంతి అవసరమని, చాలా రోజులుగా బెంచ్కే పరిమితమవుతున్న సంజూ శాంసన్కు తుది జట్టులో చోటు కల్పించాలని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.
యాషేస్ 2025-26 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య డిసెంబర్ 17న మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది. కీలక ఆటగాడిపై వేటు వేసింది.
ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ-20లో భారత జట్టు సమష్టిగా రాణించి దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. బౌలర్లు, బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. దక్షిణాఫ్రికా నిర్దేశించిన స్వల్ప స్కోరును టీమిండియా బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు.
ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ-20లో భారత బౌలర్లు చెలరేగారు. సమష్టిగా రాణించి దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. టీమిండియా బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఏకంగా 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.
టీమిండియా మరో సమరానికి సిద్ధమవుతోంది. ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో టీ-20 ఆడడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. కటక్ మ్యాచ్లో టీమిండియా, ముల్లాన్పూర్లో దక్షిణాఫ్రికా విజయం సాధించి సమఉజ్జీలుగా ఉన్నాయి.
టాస్ ఓడి బ్యాటింగ్కు దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేయగిలిగింది. డికాక్ 90 పరుగులతో అద్భుతంగా రాణించాడు.