Home » Cricket news
మన దేశంలో ప్రజలు క్రికెట్ను ఒక క్రీడగా కాకుండా ఒక పండుగలా చూస్తారు. ఇతర క్రీడల కంటే క్రికెట్ అంటేనే ఇక్కడి ప్రజలకు మక్కువ ఎక్కువ. ఇంత స్పీడ్ యుగంలో కూడా టెస్ట్ క్రికెట్ను మన దేశ వాసులు ఇష్టపడుతూనే ఉంటారు.
అండర్-19 ప్రపంచకప్లో భాగంగా యువ భారత జట్టు ఆదివారం పాకిస్థాన్తో కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఆయుష్ మాత్రే నేతృత్వంలోని యువ జట్టు కీలక మ్యాచ్కు సిద్ధమవుతున్న తరుణంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు.
టీ20 ప్రపంచకప్-2026 నుంచి బంగ్లాదేశ్ను ఐసీసీ తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మౌనంగా ఉన్న శ్రీలంక తాజాగా స్పందించింది. ఆ దేశ క్రికెట్ బోర్డు కార్యదర్శి బందులా దిస్సనాయకే బంగ్లా అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 2019లో అంతర్జాతీయ క్రికెట్కు తన రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో తాను క్రికెట్కు ఎందుకు వీడ్కోలు పలకాల్సి వచ్చిందో ఇటీవల అతడు వెల్లడించాడు. ఆటను ఆస్వాదించలేకపోవడం వల్లే తాను ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు..
అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-బి పోరులో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో డక్వర్త్ లూయీస్ ప్రకారం ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత జట్టుకు ఇది హ్యాట్రిక్ విజయం.
రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్లు సమష్టిగా రాణించి భారీ స్కోరు సాధించారు. బ్యాటింగ్కు అనుకూలించే రాయ్పూర్ పిచ్పై టీమిండియా బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
తొలి టీ20ను కైవసం చేసుకుని జోరు మీదున్న టీమిండియా మరికాసేపట్లో రాయ్పూర్లో మొదలు కాబోతున్న రెండో మ్యాచ్లో కూడా గెలుపొందాలని కృతనిశ్చయంతో ఉంది. పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలించే రాయ్పూర్ పిచ్ మీద టాస్ కీలకం
ప్రస్తుతం జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్(WPL) 2026 ఎడిషన్లో రెండు రోజుల వ్యవధిలో ఇద్దర్లు బ్యాటర్లు రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగారు. గుజరాత్ జెయింట్స్ తరఫున అరంగేట్రం చేసిన ఆయుశ్ సోని, యూపీ వారియర్స్ ప్లేయర్ హర్లీన్ డియోల్ గంటల వ్యవధిలో రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కు చేరారు. అసలు ఈ రిటైర్డ్ ఔట్ అంటే ఏమిటంటే..
భారత యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే సౌతాఫ్రికా టూర్లో తన సత్తా ఏంటో చూపాడు. తాజాగా మరోసారి విధ్వంసకర బ్యాటింగ్ ఆడాడు. అండర్-19 ప్రపంచకప్ 2026 సన్నాహకాల్లో భాగంగా యూరప్ దేశమైన స్కాట్లాండ్తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లా క్రికెటర్లకు భారీ ఎదురు దెబ్బ తగలనున్నట్లు సమాచారం. అక్కడి టాప్ ప్లేయర్లకు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ కంపెనీ 'ఎస్జీ' కీలక నిర్ణయం తీసుకుందని టాక్.