Home » CPI
ప్రధాని మోదీపై కూనంనేని వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనాన్ని బయటపెట్టాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. రాజకీయాల్లో హుందాతనం, పరిణతి అవసరమని చెప్పుకొచ్చారు. అంతేకానీ ప్రధానమంత్రిపై వ్యక్తిగత ధూషణలు, అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని విరమించుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా జి.ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రామకృష్ణ స్థానంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య వ్యవహరిస్తారు. AISF, AIYF, రైతు సంఘం నాయకుడిగా పనిచేసిన ఈశ్వరయ్య
కంబళదిన్నె- ఎమ్మిగనూరు రోడ్డును వేయాలని సీపీఐ నాయకులు భాస్కర్యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, చంద్ర, తిక్కన్న డిమాండ్ చేశారు.
జనాభా ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించాలనే అంశంపై ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
రైతులకు యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైం దని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ పేర్కొన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందడంలేంటూ సీపీఐ నాయకులు సోమవారం పట్టణంలోని కాలేజీ సర్కిల్లో ఆందోళన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులకు తమ ప్ర భుత్వమే పెద్ద పీట వేస్తుందని చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని మండిపడ్డారు.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముఖ్యమంత్రా లేక మంత్రినా..? ఓ నియంతలా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇకనైనా పద్ధతి మార్చుకోవాలి’ అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై చేసిన వాఖ్యలను ఖండిస్తున్నామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పేర్కొన్నారు. న్యాయం అడిగితే అర్బన్ నక్సలైట్ అంటారా.. అమిత్ షా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశానికి మంచి వాళ్లు కావాలని ఆకాంక్షించారు.
దేశంలో ప్రధాని మోదీ పాత్రని ఆర్ఎస్ఎస్ పోషిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా సీపీఐ పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు. నక్సలైట్ల పేరుతో గిరిజనులను అమిత్ షా చంపుతున్నారని ధ్వజమెత్తారు.
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రి నుంచి ఉదయం 10 గంటలకు హిమాయత్నగర్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్కు ఆయన భౌతిక కాయాన్ని తీసుకువచ్చారు.