Home » CPI
రైతులకు యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైం దని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ పేర్కొన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందడంలేంటూ సీపీఐ నాయకులు సోమవారం పట్టణంలోని కాలేజీ సర్కిల్లో ఆందోళన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులకు తమ ప్ర భుత్వమే పెద్ద పీట వేస్తుందని చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని మండిపడ్డారు.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముఖ్యమంత్రా లేక మంత్రినా..? ఓ నియంతలా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇకనైనా పద్ధతి మార్చుకోవాలి’ అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై చేసిన వాఖ్యలను ఖండిస్తున్నామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పేర్కొన్నారు. న్యాయం అడిగితే అర్బన్ నక్సలైట్ అంటారా.. అమిత్ షా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశానికి మంచి వాళ్లు కావాలని ఆకాంక్షించారు.
దేశంలో ప్రధాని మోదీ పాత్రని ఆర్ఎస్ఎస్ పోషిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా సీపీఐ పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు. నక్సలైట్ల పేరుతో గిరిజనులను అమిత్ షా చంపుతున్నారని ధ్వజమెత్తారు.
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రి నుంచి ఉదయం 10 గంటలకు హిమాయత్నగర్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్కు ఆయన భౌతిక కాయాన్ని తీసుకువచ్చారు.
సురవరం సుధాకర్ రెడ్డి రెండు సార్లు నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకున్ని కోల్పోయామని సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మరోసారి ఎన్నికయ్యారు.
రాజకీయాల్లో అజాతశత్రువు... తాడిత, పీడితవర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన తెలంగాణ మట్టి బిడ్డ... భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మాజీ ప్రధాన కార్యదర్శి.. సురవరం సుధాకర్ రెడ్డి (84) ఇక లేరు.
సీపీఐ ఎంఎల్ తో సీపీఐఎంల్ న్యూడెమోక్రసీ పార్టీలు విలీనమయ్యాయి. పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన సమావేశంలో..
సీపీఐ (ఎంఎల్)తో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు విలీనమయ్యాయి. పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ విప్లవ పార్టీలు విలీనమయ్యా యి.