CPI: న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:53 AM
సీపీఐ (ఎంఎల్)తో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు విలీనమయ్యాయి. పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ విప్లవ పార్టీలు విలీనమయ్యా యి.
పశ్చిమబెంగాల్ సమావేశాల్లో ఐక్యమైన విప్లవ పార్టీలు
రాంనగర్, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): సీపీఐ (ఎంఎల్)తో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు విలీనమయ్యాయి. పశ్చిమబెంగాల్లో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ విప్లవ పార్టీలు విలీనమయ్యా యి. ఈ విలీనం భవిష్యత్లో విప్లవ సంస్థల మధ్య ఐక్యతను పెంచేందుకు బలమైన పునాది ఏర్పరుస్తుందని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ అభిప్రాయపడింది.
విద్యానగర్లోని మార్క్సు భవన్లో ఆ సంస్థ కేంద్ర కమిటీ సభ్యులు వేముల వెంకట్రామయ్య, జేవి చలపతిరావు, సాదినేని వెంకటేశ్వర్రావు, బీ.ప్రదీప్, రాష్ట్ర కార్యదర్శి కార్గవర్గ సభ్యులు కే.గోవర్దన్ విప్లవ పార్టీల విలీనం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తమ పార్టీల కలయిక.. ఇతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చేందుకు, భవిష్యత్తులో విప్లవోద్యమాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగ పడుతుందన్నారు. 1969లో ఏర్పడిన సీపీఐ(మార్క్సిస్టు, లెనినిస్టు) ప్రభావంతో అనేక ప్రాంతాల్లో పీడనలు తగ్గాయని చెప్పారు.