Home » Congress
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ సీఎం, మంత్రులు ఇవాళ (గురువారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఖర్గే చర్చించారు. రెండేళ్ల ప్రభుత్వ పనితీరుపై రెండు గంటల పాటు ఖర్గే సమీక్ష జరిపారు..
మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే అభినందించారు. మేడారం జాతర చరిత్ర, ప్రాశస్త్యం గురించి మంత్రిని అడిగి తెలుసుకున్నారు..
గొగోయ్ పాకిస్థాన్ ఏజెంట్ అంటూ సీఎం చేసిన ఆరోపణలపై ఆసక్తికరమైన సర్వే జరిగింది. ఈనెల 13, 14 తేదీల్లో జరిగిన ఈ సర్వేలో మెజారిటీ అస్సాం ఓటర్లు సీఎం ఆరోపణలను విశ్వసించడం లేదని వెల్లడైంది.
మంత్రి వివేక్పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఖ్యాబలం లేకున్నా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోందని మండిపడ్డారు.
సంగారెడ్డి జిల్లాలో ఉత్కంఠకు తెరపడింది. నిన్నటి వరకు నెలకొన్న రాజకీయ అనిశ్చితిని ఛేదిస్తూ ఇంద్రేశం మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈ విజయంతో జిల్లాలో గులాబీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి.
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. తన ప్రతిపాదనను కాదని, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయన కలత చెందారు..
అసోం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపెన్ కుమార్ బోరా రాజీనామా వ్యవహారం మలుపు తిరిగింది. రాహుల్ గాంధీ మాట్లాడటంతో తన రాజీనామా నిర్ణయంపై ఆయన వెనక్కు తగ్గారు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు కుర్చీ కొట్లాట కొనసాగుతోంది. ఈ క్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్గా మోగదాల పావని రమేష్ గౌడ్ను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ అనుచరులు ఆందోళన చేపట్టారు.
తెలంగాణ మున్సిపల్ పీఠాలకు ఇవాళ కుర్చీలాట జరుగుతోంది. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారాలు ఇవాళ జరిగాయి. ఇక, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునే ప్రక్రియలో మాత్రం అనేక రకాల టర్న్స్ కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏయే పరిణామాలు, ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయో చూద్దాం..
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో క్యాంపు రాజకీయాలతో అన్ని పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. చివరి నిమిషం వరకు రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.