Home » Congress
ముఖ్యమంత్రే హోంమంత్రి అయ్యుండి కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయని హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైందని వ్యాఖ్యలు చేశారు.
స్థానిక అన్నాసాలైలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ విభాగం కానిస్టేబుల్పై చేయిచేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్.రాజ్కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నాసాలైలో ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేసిన కారును అక్కడినుంచి తరలించాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రభాకరన్ కోరగా నిరాకరించిన మైలాడుదురై ఎమ్మెల్యే రాజ్కుమార్ ఆయనపై చేయి చేసుకున్నారు.
ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, రాజకీయ వారసుడు తేజస్వి యాదవ్ వరుసగా మూడోసారి రఘోపూర్ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి శకుని చౌదరి కుమారుడు సమ్రాట్ చౌదరిని తారాపూర్ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టింది.
పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న నేతలను పక్కనపెట్టి, డబ్బున్న అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చేందుకు మొగ్గుచూపినట్టు శనివారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
దండుపాళ్యం పాలన ఎవరిదో అందరికీ తెలుసని, అధికారంలేదన్న అసహనంతో కేబినెట్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ రాష్ట్ర మంతి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అంతర్గత కుమ్ములాటలు కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మభ్యపెడుతూ గల్లీలో డ్రామాలు చేస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక, బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపే వారు ఎవరు? అని ప్రశ్నించారు.
తేజస్వి సీఎం అభ్యర్థిత్వంపై మహాకూటమిలో ఎలాంటి ఇబ్బందులు కనిపించనప్పటికీ సీట్ల పంకాల విషయంలో టెన్షన్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 48 మంది అభ్యర్థుల జాబితాను గురువారంనాడు ప్రకటించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు నవీన్ యాదవ్. ఎన్నికల అధికారులకి మొదటి సెట్ నామినేషన్ని అందజేశారు నవీన్ యాదవ్.
బీసీల బంద్కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ బిల్లును అడ్డుకునే వాళ్లు కూడా ఈ బంద్లో పాల్గొంటున్నారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా వరంగల్ డీసీసీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. పట్నాయక్ రిపోర్టుతోనే డీసీసీ అధ్యక్షుడిని ఏఐసీసీ గుర్తిస్తుందని చెప్పుకొచ్చారు. కొండా దంపతులకు ఓరుగల్లు ప్రజలు అండగా ఉన్నారని కొండా మురళి ఉద్ఘాటించారు.