Home » Congress
గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న స్పీకర్ను అవమానించిన మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నాటకాలు ఆడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాంధీభవన్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు.
కేరళ లిటరేచర్ ఫెస్టివల్ సందర్భంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు శశిథరూర్ స్పందిస్తూ, ఆపరేషన్ సిందూర్ అంశలో తాను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నానని, దానిపై తాను క్షమాపణ కోరనని తెలిపారు.
సింగరేణిలో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
మున్సిపల్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల చూపు సిరిసిల్ల మున్సిపాలిటీపైనే ఉన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సొంత నియోజకవర్గం సిరిసిల్లనే కావడం, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఈ ప్రాంతం ఉండటంతో అందరిచూపు సిరిసిల్ల మున్సిపాల్టీపై పడింది.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించేవారిని అరెస్టులు, దాడులతో భయపెడుతున్నారని ఆయన విమర్శించారు.
మాజీ మంత్రి కేటీఆర్పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం స్కామ్లేని కేటీఆర్ అంటున్నారని.. ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి టెండర్లలో సీఎం రేవంత్, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య వాటాల పంచాయితీ నడుస్తోందని.. అందుకే ఐఏఎస్, జర్నలిస్టులను బలి పశువులను చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణలో మున్నిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో ఈ ఎన్నికలకు ఇన్ఛార్జ్లుగా మంత్రులను నియమిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను వదులుకుని తప్పు చేశానని అన్నారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్లో చేరానని తెలిపారు..