Home » Congress
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పెట్టినందుకు కవితకు ధన్యవాదాలు తెలిపారు. అమ్మగా జేబులు చూసి కాదని.. కడుపు చూసి పాలిస్తానని ఆమె చెప్పారని ప్రస్తావించారు.
నర్సంపేటలో ఉద్రిక్తతలకు కారణం కేంద్ర మంత్రి బండి సంజయ్ అని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ మృతిని కేంద్ర మంత్రి రాజకీయం చేస్తున్న తీరు హేయనీయం, సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు చెబుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్, హరీశ్.. ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల కృషి మర్చిపోలేనిదని.. ఆ విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉందన్నారు.
ఘోష్ కమిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పుతో తమకేదో లాభం చేకూరిందని బీఆర్ఎస్ భావిస్తోందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తెలిపారు. బీఆర్ఎస్ నేతలు అప్పుడే చంకలు గుద్దుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ స్థాయి.. రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు తెలుసని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని తెలిపారు. జగిత్యాల సభలో కేసీఆర్ హుందాగా మాట్లాడారని చెప్పుకొచ్చారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్కు కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది రాహుకేతు గ్రహమని బండి సంజయ్ అంటున్నారని.. అసలు బండి సంజయ్ ఏ గ్రహమని ఎద్దేవా చేశారు.
కల్వకుంట్ల కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం మాత్రమే వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుందని ఆరోపించారు.
ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు, విశ్వాసం తక్కువని... అవకాశవాదం ఎక్కువని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎప్పుడూ శత్రువుని తక్కువ అంచనా వేయకూడదని సూచించారు.
ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం, ప్రతిపక్షం సభలు పెట్టాయంటూ కవిత మండిపడ్డారు. ప్రతిపక్షం ఉట్టికథలు చెబితే.. ప్రభుత్వం పిట్టకథలు చెప్పిందంటూ వ్యాఖ్యానించారు.