Home » Congress
జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్కి సోయి వస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలతో ప్రజలు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మా అసోసియేషన్ను కోరినట్లు చెప్పారు
బీసీలకు నోటి దాకా వచ్చిన ఫలాలను అడ్డుకున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందన్న ఆయన.. మోదీ బీసీ ప్రధాని అని చెప్పుకునే బీజేపీ నేతలు, బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు ఒత్తిడి తీసుకురావటం లేదు? అని ప్రశ్నించారు.
జాతిపిత మహాత్మాగాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భరత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారతదేశ వ్యాప్తంగా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం ఏఐసీసీ, 22 మంది సీనియర్ నేతలను పరిశీలకులుగా నియమించి, రాష్ట్రానికి పంపించింది. ఈ రోజు నుంచి వీరంతా తెలంగాణలోని 35 జిల్లాల్లో పర్యటిస్తారు.
నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు దేశం కాని దేశంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని మాజీ మంత్రి అన్నారు. అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక.. కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికలో తమని గెలిపించి రాజకీయ మార్పు చూడాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాన్ని ప్రజలు తిప్పికొట్టాలని రాంచందర్ రావు సూచించారు.
పార్టీ చర్యలతో మనస్తాపం చెందినట్లు అంజన్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తాను చాలా సీనియర్నని.. తానెప్పుడు ఎప్పుడూ ఓడిపోలేదని.. అందరూ కలిసి ఓడగొట్టారని వ్యాఖ్యలు చేశారు.
కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి చెందిన అబ్దుల్లా పూర్ మెట్లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో భారీ దోపిడి జరిగింది. కాలేజీలోని లాకర్స్ బ్రేక్ చేసి కోటి రూపాయలు దోచుకెళ్లారు దొంగలు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో తనను సంప్రదించరా అని మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. లోకల్, నాన్లోకల్ ఇష్యూ ఇప్పుడే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని అంజన్కుమార్ యాదవ్ నిలదీశారు.