• Home » Congress

Congress

మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణ.. సీఈసీని ఆశ్రయించిన కాంగ్రెస్‌ నేతలు..

మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణ.. సీఈసీని ఆశ్రయించిన కాంగ్రెస్‌ నేతలు..

రాజ్యసభ ఎన్నికలకు ముందు తగిలిన ఎదురుదెబ్బపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్‌ డివిజన్‌ కమిటీల ఏర్పాటు ఎప్పుడో?

కాంగ్రెస్‌ డివిజన్‌ కమిటీల ఏర్పాటు ఎప్పుడో?

అంబర్‌పేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ డివిజన్‌ కమిటీల ఏర్పాటులో పార్టీ నియోజకవర్గ నాయకత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణను దోపిడీ చేశారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణను దోపిడీ చేశారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర మంత్రివర్గం 18 గంటలు పనిచేస్తుంటే... బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఏదో ఒక అభాండం వేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సన్నబియ్యం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.

దేవెగౌడకు అవమానం.. రాజ్యసభకు బీజేపీ టిక్కెట్ నిరాకరణపై కాంగ్రెస్ ధ్వజం

దేవెగౌడకు అవమానం.. రాజ్యసభకు బీజేపీ టిక్కెట్ నిరాకరణపై కాంగ్రెస్ ధ్వజం

జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ పార్లమెంటరీ ఇన్నింగ్స్ ముగిసింది. కర్ణాటకలో పొత్తులో భాగంగా మరోసారి రాజ్యసభ టిక్కెట్‌‌ను దేవెగౌడకు ఇవ్వాలని జేడీఎస్ ఆశించింది. అయితే బీజేపీ తమ రాజ్యసభ అభ్యర్థిగా ప్రొఫెసర్ ఎం.నాగరాజును ప్రకటించింది.

ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా కూటమి నేతలు..

ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా కూటమి నేతలు..

ఇండియా బ్లాక్ పార్టీలు దేశ రాజధానిలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈరోజు (సోమవారం) కూటమిలోని అన్నీ పార్టీల నేతలంతా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐదు కీలక నిర్ణయాలను ఇండియా కూటమి నేతలు ప్రకటించారు.

ఫోన్‌ ట్యాపింగ్ నిందితులకు శిక్ష పడాల్సిందే: ఎంపీ చామల కిరణ్ కుమార్

ఫోన్‌ ట్యాపింగ్ నిందితులకు శిక్ష పడాల్సిందే: ఎంపీ చామల కిరణ్ కుమార్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. బంజారాహి‌ల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కిరణ్ స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు.

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటం: మహేశ్ గౌడ్

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటం: మహేశ్ గౌడ్

నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రధాని చేతగానితనం వల్ల లక్షలాది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి దాపురించిందన్నారు.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మాజీ ఎంపీ మధుయాష్కీ సతీమణికి గాయాలు

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మాజీ ఎంపీ మధుయాష్కీ సతీమణికి గాయాలు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ సతీమణి డా. సుచి గౌడ్ కారు ప్రమాదంలో గాయపడ్డారు. అమెరికాలో ఈ కారు ప్రమాద ఘటన చోటుచేసుకుంది.

కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే

కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం తమ కీలక భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌కు రాజ్యసభ స్థానం కేటాయించింది. తమిళనాడు నుంచి రాజ్యసభ స్థానానికి జూన్ 18న ఎన్నిక జరుగనుంది.

జనసేన కాదు.. బీజేపీ ‘భజనసేన’: సామ రామ్మోహన్

జనసేన కాదు.. బీజేపీ ‘భజనసేన’: సామ రామ్మోహన్

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రెస్‌మీట్‌లో పవన్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి