Home » Congress Govt
మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం కట్టారని.. ఆ ప్రాజెక్టు పేరుతో నిధులు మెక్కారని ఎద్దేవా చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరుతో ఆయన డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
పదేళ్లలో తెలంగాణ ప్రజల జీవితాలను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో నీటి పారుదల శాఖను నాశనం చేశారని ధ్వజమెత్తారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సెటైర్లు గుప్పించారు. గురుకులాల టెండర్లు, తెలంగాణ అప్పులతోపాటు అవినీతి, అక్రమాలపైనా చర్చిద్దాం రావాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాలతో ప్రజలను మబ్బే పెట్టే కార్యక్రమం రేవంత్రెడ్డి ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉందని, అందుకే వారు బహిరంగ చర్చకు ముందుకు వచ్చారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మంత్రులు పూర్తిగా, పారదర్శకంగా పనిచేస్తున్నారని తెలిపారు.
తెలంగాణలో ప్రభుత్వ అప్పులు, గురుకులాల టెండర్లపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పులు రూ.2.80లక్షల కోట్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు.
రేవంత్రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని.. రెన్యువల్ సీఎం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సెటైర్లు వేశారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.