Home » Congress Govt
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని జూబ్లీహిల్స్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డితో మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
కవిత ఎందుకు అలాంటి కామెంట్లు చేశారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని మాజీ మంత్రి హరీష్రావు చెప్పుకొచ్చారు. తమ వ్యతిరేక పార్టీలు మామీద ఎలాంటి కామెంట్లు చేశాయో... కవిత కూడా అలాంటి కామెంట్లను తనమీద చేశారని విమర్శించారు. ఎరువుల కొరత వరద ప్రభావం ఇలాంటి సమస్యలతో రాష్ట్రం ఇబ్బంది పడుతోందని హరీష్రావు పేర్కొన్నారు.
యూరియా సరఫరా పెరుగుతున్న నేపథ్యంలో రైతు వేదికల వద్ద అదనపు యూరియా సేల్ కౌంటర్లు ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. వచ్చే 20 రోజులు.. రోజుకు 10,000 మెట్రిక్ టన్నుల చొప్పున రాష్ట్రానికి సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్లుగా టీచర్ల నియామకం చేపట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత పదేళ్లుగా టీచర్ల బదిలీలు జరగలేదని తెలిపారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని ఆలోచన చేస్తు్న్నట్లు చెప్పారు.
మేడిగడ్డ మూడు పిల్లర్లు కుంగితే రేవంత్రెడ్డి సర్కార్ రాద్ధాంతం చేస్తోందని మాజీ మంత్రి హరీష్రావు ధ్వజమెత్తారు. ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వానాకాలంలో విద్యుత్ డిమాండ్ ఉండదని హరీష్రావు చెప్పుకొచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వనరులను సమీకరించి సహాయక చర్యలు చేపడుతుందని మంత్రులు పేర్కొన్నారు. 7 ఎన్డీఆర్ఎఫ్, 15 ఎస్టీఆర్ఎఫ్ బృందాలు, సుమారు 100 మంది సైనిక సిబ్బంది సహాయ కార్యకలాపాలలో పాల్గొంటున్నారని తెలిపారు.
బీజేపీకి, బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం ఉందో.. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో బట్టబయలయ్యిందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ వేసింది.. శిక్షించేందుకు కాదని తెలిపారు.
వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద ఈ ఏడాది వచ్చిందని.. తమ ప్రభుత్వం బాధితులను కచ్చితంగా ఆదుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా కల్పించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధితులకు అండగా నిలిచి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశారని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లాలో రేపు(గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్కు చేరుకోని వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు ఆర్&బి బ్రిడ్జ్ను పరిశీలించనున్నారు.
మాజీ ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరోక్షంగా ఫైర్ అయ్యారు.