Home » CM Revanth Reddy
మూసీ రివర్ డెవలప్మెంట్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్రెడ్డి కీలక సూచనలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ వరుస విమర్శలు చేశారు. 'ఓట్లు కాదు.. ప్రజల పాట్లు చూడండి' అంటూ సీఎం రేవంత్ బిహార్ ఎన్నికల ప్రచారంపై సెటైర్లు వేశారు. ఎప్పుడొస్తాయో తెలియని బిహార్ ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్ఠానం ముందు మోకరిల్లారంటూ..
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై దొంగ ఓట్లతో గత ఎన్నికల్లో గెలిచారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దొంగ ఓట్లతో బీజేపీ గెలిచినట్టుగా సాక్షాలు ఉంటే దమ్ముంటే బయట పెట్టాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఓడిపోతుందన్న భయంతోనే దొంగ ఓట్లు అంటూ.. నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏర్పడే సకల విఘ్నాలను తొలగించాలని ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ వేదికగా 2036 ఒలింపిక్స్ నిర్వహణకు గాను బిడ్ వేసేందుకు గల అవకాశాలపై చర్చించడమే ప్రధాన ఎజెండాగా గురువారం (ఈనెల 28న) తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు గవర్నర్స్ సమావేశం జరుగనుంది.
ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి.. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.
రెండు తెలుగు రాష్ట్రాలు వినాయక చవితి శోభతో కళకళలాడుతున్నాయి. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రస్తుతం విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్న సంగతి తెలిసిందే. విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇతరులకు ఇస్తే శాఖను పట్టించుకుంటారో లేదో అనే సందేహాంతో తన వద్దే ఉంచుకున్నట్లు చెప్పారు.
వినాయక చవితి సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ మీటింగ్కు తెలంగాణ స్పీకర్, ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ స్టిక్కర్ ఉన్న స్కార్పియో వాహనంలో ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటం, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో అనుమానంతో తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.
బిహార్ రాష్ట్రంలో ఎలాంటి ప్రజా లెక్కలు లేకుండా.. మైనారిటీ, క్రిస్టియన్ల ఓట్లని తొలగించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆ ఓట్లు పడవనే వాటిని తీసేశారని విమర్శించారు. ఓట్ల చోరీపై చర్చ చేస్తే దొంగలెవరో బయటపడుతారని ఎద్దేవా చేశారు. అందుకోసమే.. కనీసం చర్చ కూడా చేయకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతారని మండిపడ్డారు.