Home » CM Revanth Reddy
సీఎం రేవంత్రెడ్డికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉప్పల్ సభలో కిషన్రెడ్డిపై సీఎం చేసిన వ్యాఖ్యలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
మహిళల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కొడంగల్లో ఓడినా తనను మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించారని ప్రస్తావించారు.
సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అంశం మీద ఎక్కడ చర్చ పెడదామో చెప్పాలని సవాల్ విసిరారు. ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని హెచ్చరించారు.
సీఎం రేవంత్రెడ్డిపై.. మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిట్లర్ను చూసి హైడ్రా పెట్టానని అంటావా....? కళ్లు నెత్తికి ఎక్కాయా..? అని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ వాళ్లు కోహెడ ఫ్రూట్ మార్కెట్ కట్టొద్దని అంటున్నారు. భారత్ ప్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి వీల్లేదంటారు.
జల వనరులను ఆక్రమించే పెద్ద తిమింగలాల గుండెల్లో వణుకు పుట్టించడానికే ‘హైడ్రా’ను ఏర్పాటు చేశామని, హిట్లర్ స్ఫూర్తితోనే ఆ పేరు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ నుంచి కూడా అతి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన అందించనున్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి అష్టదరిద్రులు అడ్డం పడుతున్నారని ధ్వజమెత్తారు. కాళ్లలో కట్టెలు పెట్టినా.. మూసీలో పడి దొర్లినా వాళ్లను పట్టించుకోమని విమర్శించారు.
తెలంగాణలో వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయిస్తే.. అందులో తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ కేసీఆర్ రాసిన మరణ శాసనం సంక్లిష్టంగా మారింది. దానిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం.