Home » CM Chandrababu Naidu
పిఠాపురంలో జరిగిన ప్రొటోకాల్ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, పార్టీ నేతలు ఐక్యంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. నాదెండ్ల మనోహర్ను సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు.
2024 ఎన్నికల సమయంలో కాకర్ల వెంకట్రామిరెడ్డి వైసీపీ జెండాలు పట్టుకుని ప్రచారం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని అశోక్ బాబు తెలిపారు. బద్వేల్ రిటర్నింగ్ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగానే అప్పట్లో వెంకట్రామిరెడ్డిపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని చెప్పారు.
తమిళ ప్రజల భవిష్యత్తు కోసం తానే స్వయంగా చెన్నైకి వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు ఓటు వేయాలని ఆయన కోరారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం ఎన్.చంద్రబాబు దేశ రాజకీయా ల్లో చరిత్ర సృష్టించారని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, టీటీడీబోర్డు సభ్యుడు నన్నూరి నర్సిరెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఎన్డీఏ హయాంలో దేశవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మన సొంత ఇంటి పైకప్పులపైనే విద్యుత్ను ఉత్పత్తి చేసుకోగల స్థాయికి మనం చేరుకున్నామని పేర్కొన్నారు.
ఏపీకి, తమిళనాడుకు ఎనలేని అనుబంధం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తనకున్న రాజకీయ అనుభవంలో ఎంతో మంది నాయకులను చూశానని పేర్కొన్నారు.
ప్రజాహిత బిల్లులను అడ్డుకోవడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మహిళా బిల్లును డీఎంకే అడ్డుకుందని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు నిరంతరం ప్రజల కోసం తపిస్తుంటారని మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి తెలిపారు. ఆయన ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగాలని, ఇంకా చాలాకాలం సీఎంగా ప్రజలకు తోడుగా ఉండాలని మహాయజ్ఞం నిర్వహించామన్నారు మంత్రి.