Home » CM Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. దుబాయ్లో మూడో రోజు పర్యటనలో భాగంగా యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.
బస్సు ప్రమాదానికి సంబంధించి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు.. కలెక్టరేట్లో: 08518-277305, కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో: 91211 01059, ఘటనాస్థలి వద్ద: 91211 01061.
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా వైద్యశాఖకు సూచనలు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఫిట్నెస్, సేఫ్టీ , పర్మిట్ తనిఖీలకు ముఖ్యమంత్రి ఆదేశించారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇవాళ(శక్రవారం) తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ అగ్నిప్రమాదంలో బస్సులోనే పలువురు సజీవదహనం అయ్యారు.
కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాదంపై హోం మంత్రి అనిత స్పందించారు. ప్రమాద సమయంలో బస్సులోనే చాలామంది ప్రయాణికులు సజీవదహనం అవ్వడం అత్యంత విచారకరమన్నారు.
తిరువూరు టీడీపీ ఇష్యూపై తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పందించారు. తాను టీడీపీలో క్రమ శిక్షణగల నాయకుడినని కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీలో బాధ్యత లేకుండా ప్రవర్తించే నేతలని ఇక మీదట ఉపేక్షించబోనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీలో కొందరు నేతల క్రమశిక్షణా రాహిత్యంపై, మీడియా, సోషల్ మీడియాల్లో రచ్చకు దిగడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈలో పర్యటిస్తున్నారు. యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అబుదాబీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతున్నారు. ఈ భేటీల్లో ఏపీకి కావాల్సిన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు.
కరువు నేలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నీటి వనరులే లేని మడకశిర ప్రాంతంలో కృష్ణాజలాలు ఉరకలు వేస్తున్నాయి. హంద్రీనీవా కాలువ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేస్తున్నారు.
వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై మంత్రులు, సీఎస్, ఆర్టీజీ అధికారులతో మాట్లాడారు సీఎం. యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు.