Home » CM Chandrababu Naidu
కాశీబుగ్గ మృతుల కుటుంబాల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు.
కాశిబుగ్గ విషాదాన్ని రాజకీయంగా వాడుకోవాలనే వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని సంధ్యారాణి మండిపడ్డారు. ఇటువంటి మానవీయ విషాదంలో రాజకీయాలు చేయడం తీవ్రమైన అనైతిక చర్య అని పేర్కొన్నారు.
ఏపీలో ధాన్యం రైతులకు కూటమి సర్కార్ శుభవార్త తెలిపింది. సోమవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ మేరకు మంత్రి నాదెండ్ల శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
సత్యసాయి శతజయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాలని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.
సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. అభివృద్ధి చేసి ఆదాయం వస్తేనే సంక్షేమం చేయగలమని నొక్కి చెప్పారు.
వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ పార్టీకి ఏమీ దొరకటం లేదని.. వారి జీవితమే ఫేక్ అని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు.
తుపానులో ముందస్తు ప్రణాళిక ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని.. కానీ, తొక్కిసలాటలో ఇంతమంది మృతి చెందటం బాధాకరమన్నారు సీఎం చంద్రబాబు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందని... విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
టీడీపీ నేతలకి సంబంధించిన తిరువూరు విభేదాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ ఎవరు దాటినా సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
భగవద్గీతపై ఎమ్మెల్యే ఎమ్.ఎస్.రాజు వ్యాఖ్యలు అర్థరహితమని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. భగవద్గీతతో ప్రయోజనం లేదన్న అతనికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
తుఫాన్ సమయంలో ఏ ఒక్కరికీ ప్రాణ నష్టం జరగకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. దాదాపు 1500 మంది విద్యుత్ శాఖ సిబ్బందిని ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాలకు పంపించినట్లు పేర్కొన్నారు.