Home » CM Chandrababu Naidu
ఎన్డీయే ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రజల కోసం అన్నదాతలు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. తాను ఐటీని ప్రోత్సహించి ఎందరో రైతన్నల బిడ్డలను ఐటీ ఉద్యోగాల వైపు వెళ్లేలా చేశానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
క్రీడా రంగం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. యువ క్రీడాకారులకు ప్రోత్సాహకంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ తరాలకు ఆదర్శమని తెలిపారు.
వెలిగొండ నిర్మాణం పూర్తి కాకుండానే గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ ప్రాజెక్టును ప్రారంభించారని మంత్రి రామానాయుడు తెలిపారు. తల్లిని, చెల్లిని మోసం చేసిన జగన్కు ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చెయ్యడం లెక్కకాదని ఆరోపించారు.
ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళలు సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణిని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు.
క్వాంటం కంప్యూటర్ను వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్ధంగా వనరుల్ని వినియోగించగలుగుతున్నామన్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రతిష్ట పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం గతం కంటే చాలా బావుందని భక్తులు చెబుతున్నారని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆజ్ఞాపించారు. ఇక అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు పల్లా శ్రీనివాసరావు .
నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ అవార్డును అందుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. నారా భువనేశ్వరి రెండు పురస్కారాలు అందుకోవడం హర్షణీయమని ట్వీట్ చేశారు.
కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరు మీద వైసీపీ నేతలు చేస్తున్న నాటకాలు ఆపాలని హితవు పలికారు మంత్రి అచ్చెన్నాయుడు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. డీజే ఏర్పాటు చేయగా.. అనుమతి లేదని పోలీసులు దాన్ని తీయించారు.