Home » Chittoor
అంబేద్కర్ విగ్రహానికి మంటలు ఘటనలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి హస్తం ఉందంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. స్థానిక బొమ్మయపల్లి సర్పంచ్ గోవిందయ్య ఆడిన డ్రామాలో టీడీపీని బలి చేయాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టి చివరకు అతనే అరెస్టయ్యాడని తెలుగు తమ్ముళ్లు పేర్కొన్నారు.
మానవత్వమే సిగ్గుపడే దృశ్యం ఇది. తిరుపతి రుయా ఆసుపత్రికి ఎదురుగా ఇస్కాన్ రోడ్డులోని బస్టా్పలో బతికున్న శవాల్లా పడివున్నారు వీరంతా. ఎవరో తెలీదు. ఎక్కడి నుంచి ఎలా వచ్చారో తెలీదు. ఎప్పుడొచ్చి ఈ నీడకు చేరారో ఏమో.. మూలుగుతూ ముక్కుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టక పోయినా పెట్టినట్లు ఘటనను సృష్టించి స్థానిక టీడీపీ నాయకులపై నెపం నిట్టే ప్రయత్నానికి వైసీపీ సర్పంచ్ గోవిందయ్య ఒడిగట్టారు.
అప్రమత్తమైన పోలీసులు తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం, గోవిందరాజుల స్వామి ఆలయం ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. జడ్జిల నివాస సముదాయం, కోర్టు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
విగ్రహానికి ఆనుకుని ఉన్న షెడ్డుకు ఆగంతకులు రాత్రి నిప్పు పెట్టడటంతో అంబేద్కర్ విగ్రహానికి నష్టం జరిగిందని అధికారులు వివరించారు. జాతీయ నేతల విగ్రహాలకు అవమానం జరిగేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు సీఎం.
చిత్తూరు జిల్లా దేవలంపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో విగ్రహం అగ్నికి ఆహుతైంది.
ఆలస్యంగా వెలుగుచూసిన గ్యాంగ్ రేప్ ఘటన చిత్తూరు నగరంలో కలకలం రేపింది.
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా మొదలు కానుంది.
మొత్తం ఆరుగురు సీనియర్ విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. దాడి చేయడంతో పాటు ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తాం అంటూ బెదిరింపులకు దిగారు.
ప్రస్తుతం మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న పీలేరు త్వరలో మున్సిపాలిటీగా అవతరించనున్నట్లు తెలుస్తోంది. దినాదినాభివృద్ధి చెందుతున్న పీలేరును అభివృద్ధి పథంలో నిలపాలంటే మున్సిపాలిటీగా చేయక తప్పదనే అభిప్రాయంతో ఎమ్మెల్యే నల్లారి కిశోర్కుమార్రెడ్డి ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.