Home » Chittoor
రైలు ఢీకొని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడొకరు మృతిచెందిన విషాద సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. నర్రావుల బాబు అనే టీడీపీ నాయకుడు నెల్లూరు జిల్లా గూడూరుకు వెళ్లాడు. అక్కడ రైలు పట్టాలు దాడుతుంగా అదే సమయంలో వచ్చిన రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు
ఎన్వీయూలో మరోసారి చిరుత సంచారంతో సిబ్బంది, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి ఎస్వీయూలోని కోళ్ల గూడుపై చిరుత దాడి చేసింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబానాయుడు సతీమణి భువనేశ్వరి తమిళంలో మాట్లాడారు. ఎలారిక్కిం సౌగ్యమా... అంటూ పలకరించారు. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించారు. అయితే.. అక్కడికి విచ్చేసిన వారితో తమిళంలో మాట్లాడారు.
రూ.7 కోట్ల దోపిడీ కేసులో చిత్తూరు జిల్లా గుడిపాల వాసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు సైతం ఈ విషయాన్ని గుర్తించి విచారణ ప్రారంభించారు. అలాగే ఓ ఇన్నోవా వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
టీటీడీ పరాకమణి కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని శాలివాహన కుమ్మర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సతీష్ ఆత్మహత్య చేసుకునేంత పరికివాడు కాదని పేర్కొంది.
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక ప్రత్యేక టాస్క్ ఫోర్సుకు జీవం పోసినట్లు పవన్ తెలిపారు. ఎర్రచందనం ద్వారా వచ్చే ఆదాయంలో నిర్దేశిత శాతం వాటి వనాల అభివృద్ధి, సంరక్షణకు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
మంగళవారం నాడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వెల్లడించారు.
ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్న ప్రజలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్ల వాహనాన్ని అప్పినపల్లి గ్రామస్తులు వెంబడించి మరీ పట్టుకున్నారు.
కుప్పం నియోజకవర్గానికి రూ.2979 కోట్ల పెట్టుబడితో మరో రెండు భారీ పరిశ్రమలు రానున్నాయి. రాష్ట్ర రాజధానిలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
డిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడు ఘటనతో తిరుపతిలో హై అలర్ట్ ప్రకటించారు.