Home » Chittoor
గ్రామపంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతంగా అమలుచేసేందుకు, నిత్యం పర్యవేక్షించేందుకు ‘డివిజన్ డెవల్పమెంట్ ఆఫీస్’ (డీడీవో) ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. చిత్తూరు జిల్లాకు నాలుగు కార్యాలయాలు కేటాయించగా, చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరిలలో ఏర్పాటు చేశారు. నవంబరు 1 నుండి ఈ కార్యాలయాలు పనిచేస్తాయి.
పోక్సో కేసులో అన్నమయ్య జిల్లా యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, విధిస్తూ చిత్తూరు న్యాయస్థానం తీర్పు చెప్పింది.
పదేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన చిత్తూరు ప్రథమ మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్యకేసు విచారణ చివరి ఘట్టానికి చేరుకుంది. శుక్రవారం న్యాయమూర్తి తుది తీర్పు వెల్లడించనున్నారు.
ఒక్క కుటుంబంలోనో, గ్రామంలోనో... ఐఏఎస్, ఐపీస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు... ఐదారుగురు ఉన్నారని అప్పుడప్పుడు వార్తల్లో చదివి ఆశ్చర్య పోతాం. ‘వారెంత అదృష్టవంతులో కదా’ అనుకుంటాం. అయితే.. చిత్తూరు జిల్లాలోని ‘కార్వేటినగరం’ మండలానికి వెళితే ఏకంగా వెయ్యి మంది ఉపాధ్యాయులను చూడొచ్చు.
వెదురుకుప్పం మండలం దేవళంపేట వద్ద రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడి గ్రామస్తులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
పలమనేరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ పోలీసులపై దౌర్జన్యం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు.
నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడు ఏ 13 కట్టా సురేంద్ర నాయుడును పోలీసులు ప్రత్యేకంగా విచారిస్తున్నారు. మిగిలిన 9 మందిని వేరువేరుగా ఎక్సైజ్ పోలీసులు విచారిస్తున్నారు.
తక్కువ ధరకే మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపు యజమానిపై దాడికి దిగాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఈ దాడి ఒకరు తీవ్రంగా గాయపడటంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.
మొలకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై మదనపల్లి జైల్లో రిమాండ్లో ఉన్న పదిమంది నిందితులను ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి అనుమతించింది తంబళ్లపల్లి కోర్టు. అయితే, మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.
శ్రీకాళహస్తి జనసేన నేత కోట వినుత డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. వినుత , ఆమె భర్త ప్రైవేటుగా ఉన్న వీడియోలు పంపితే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి రూ. 30 లక్షలు ఇస్తామన్నారని రాయుడు వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు.