Home » Chittoor
చిత్తూరు జిల్లాలోని గ్రామాల్లో చనిపోయిన వ్యక్తుల ఆత్మలు వచ్చి గుర్రంకొండ మండలంలో ఉపాధి హామీ పథకంలో పనులు చేశాయి. ఈ ఆత్మలు కూడా వారం రోజుల పాటు ఉపాధి పథకంలో వంక పనులు, చెరువులో పూడికతీత పనులు, పండ్ల తోటల పనులు చేయడం విశేషం. గ్రామాల్లో పాడి రైతుల కోసం నిర్మించిన గోకులాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తనిఖీ బృందం బహిరంగ సభలో వెల్లడించింది.
చిత్తూరు జిల్లాలో మదనపల్లె చాలా కీలకమైన ప్రాంతం. ఇక్కడి భూములు విలువైనవే కాదు.. ఇక్కడ భూకబ్జాలు, ఆక్రమణలు, ఫోర్జరీ రికార్డులతో స్వాధీనం చేసుకునే రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మధ్యవర్తులు ఎక్కువగా ఉన్నారు. కీలకమైన రెవెన్యూ సిబ్బంది, అధికారులే వీరికి ప్రత్యక్ష, పరోక్షకారులు. ఈ క్రమంలో అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో వీరంతా కలసి పనిచేసినవారే.
తిరుపతి నగరం దక్షిణ దిశగా విస్తరణకు మార్గం సుగమం కానుంది. నగరానికి దక్షిణంగా ఉన్న పల్లెల ప్రజలకు జాతీయ రహదారిని దాటడం అనే ప్రాణాంతక సమస్యకు పరిష్కారం లభిస్తోంది.
ఎడమచేతి వాటం కలిగిన వారిని ఒకప్పుడు పుర్రచెయ్యోడు లొడ్డోడు.. అని ఎగతాళి చేసేవారు. ఎడమచేతిని వాడటం ఏ రకంగానూ లోపం కాదు అయినా ఇప్పటికీ కుటుంబాల్లో కూడా ఎంతో కొంత గాయపడే మాటలు విసురుతూనే ఉంటారు. బలవంతంగా కుడి చేతిని వాడాలని వేధిస్తుంటారు.
ప్రపంచ ఫొటోగ్రఫీ డేని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీపీజేఏ) నిర్వహంచిన జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో తిరుపతి ఆంధ్రజ్యోతి స్టాప్ ఫొటోగ్రాఫర్లు ఆర్ లావణ్య కుమార్, కె.సాయికుమార్లకు బహుమతులు లభించాయి.
సుదుటిపై మూడు నామాలతో జన్మించిన ఆవుదూడను చూసి అంతా ఆశ్చర్యపోయారు. చౌడేపల్లె మండలం గడంవారిపల్లె పంచాయతీ పెద్దకంపల్లెకు (యల్లంపల్లె) చెందిన రవినాయుడు సంబంధించిన పశువులకు గత ఏడాది లంపిస్కిన్ వ్యాధి సోకడంతో నయమైతే ఓ దూడను టీటీడీ గోశాలకు ఇస్తానని మొక్కుకున్నాడు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారులకు ప్రాధాన్యత ఇచ్చి రూ.222 కోట్లతో మరమ్మతులు, అభివృద్ధి చేయగా..తాజాగా మరిన్ని ఆర్అండ్బీ రహదారుల అభివృద్ధికి రూ.38.25 కోట్లను విడుదల చేసింది.
గుడికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
తిరుపతి జిల్లా పోలీసుల పొదిలోకి ఇటీవల అందిన ఒక సాంకేతిక ఆయుధం డ్రోన్ భిన్న అవసరాలకు ఉపయోగపడే వివిధ సామర్థ్యాలున్న 9 డ్రోన్లు ప్రభుత్వం తిరుపతికి కేటాయించింది. దేశ నలుమూ లల నుంచి వచ్చే జనంలో నేరస్థులు సులువుగా కలగలిసిపోయే అవకాశమున్న ప్రాంతం కావడంతో వీటి అవసరం మరీ ఎక్కువ. అలాగే తరచూ వీవీఐపీల పర్యటనలు, భారీ సభలు జరుగుతుండటంతో క్రౌడ్ కంట్రోల్కి కూడా డ్రోన్ల సాయం పోలీసులకు బాగా ఉపయోగపడుతోంది.
సింహం.. అడవికి రారాజు.. ధైర్యసాహసాలకు మారుపేరు. వేటాడటంలో దీని నైపుణ్యమే వేరు. బాల్యంలో కథా వస్తువుగా నిలిచే ఈ మృగరాజు ఆఫ్రికన్ దేశాల్లో హవా చాటుకుంటున్నా మనదేశంలో అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేరిపోయింది.