Home » Chittoor
ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుప్పం పర్యటనలో కడా ద్వారా ఆరు కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు.
పలమనేరు మండలం బయప్పగారిపల్లి పం చాయితీ ఊసరపెంట గ్రామ సమీపంలోని వరి, అరటి తోటలపై ఏనుగులు దాడి చేసి పంటలను ధ్వంసం చేశాయి.
జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్లకు లాటరీ ప్రక్రియను పూర్తిచేశారు.
వివిధ రకాల పుష్పాలతో, విద్యుత్ అలంకరణతో శోభాయమానంగా కాణిపాకం ఆలయాన్ని ముస్తాంబు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున గణేష్ మాల ధారణ ధరించి స్వామివారికి ఇరుమడి దీక్షలను సమర్పించారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్వామివారిని దర్శించుకోనున్నారు.
వైసీపీ పాలనలో ఆడుదాం ఆంధ్రా పోటీలకు రూ.119 కోట్లు కేటాయించి, దుర్వినియోగం చేశారని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆరోపించారు. నిధులు పూర్తిగా పక్కదారి పట్టినట్లు విచారణలో తేలిందని అన్నారు. అమరావతి చాంపియన్షిప్ రాష్ట్రస్థాయి పోటీలలో భాగంగా సోమవారం ఉదయం ఎస్వీక్యాంపస్ హైస్కూల్ మైదానంలో విలువిద్య పోటీలను ఆయన ప్రారంభించారు.
ఆగస్టు 23న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు ఉదయం 11 గంటలకు విడుదల చేయబడతాయని టీటీడీ తెలిపింది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈనెల 30వ తేది కుప్పం సమీపంలోని పరమసముద్రం చెరువు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవా జలాలకు హారతి ఇచ్చి స్వాగతించనున్నట్లు హెచ్ఎన్ఎ్సఎస్ ఎస్ఈ విఠల్ ప్రసాద్ తెలిపారు.
కుప్పం మున్సిపాలిటీతోపాటు నాలుగు మండలాలకు పార్టీ అధ్యక్షుల నియామకంకోసం అధిష్ఠానం ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేయడం ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెన్షన్ల పంపిణీని కొంతమంది ఉద్యోగులు అభాసుపాల్జేశారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
క్యాలెండర్లో కాయితాలు చిరిగిపోతున్నాయి తప్ప, ప్రజల కడగండ్లు తీరుతున్నాయా? అధికారం చేతులు మారింది తప్ప, జీవనప్రమాణాలు పెరిగాయా? సొంత పాలనలోకి మారి ఏడు దశాబ్దాలు దాటి ఎనిమిదో దశాబ్దంలోకి అడుగుపెడుతున్నా పల్లెలు ఈసురోమంటూనే ఉన్నాయి. సేద్యం ఒక జూదంగా మారిపోయింది.