Home » Chennai News
బంగాళాఖాతంలో వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17 నుంచి డిసెంబరు 7వ తేది వరకు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు.
దేశంలోని అన్ని ప్రాంతాలకు కాశితో సంబంధాలున్నాయని గవర్నర్ ఆర్ఎన్ రవి పేర్కొన్నారు. స్థానిక ఐఐటీ మద్రాసు క్యాంప్సలో ‘కాశి తమిళ సంఘం 4.0’ను సోమవారం గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... కాశి తమిళ సంగమం ప్రధాన మంత్రి మోదీ దీర్ఘకాల దృష్టి అన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఓటర్లకు సమస్య కలిగించే ‘ఇడియాప్పం’ కాదని, సులువుగా జీర్ణమయ్యే ‘ఇడ్లీ’ వంటిదని బీజేపీ మహిళా నాయకురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కామెంట్ చేశారు.
విరుదునగర్ జిల్లా రాజపాళయంలోని నచ్చాడై తవిర్తరుళియ స్వామివారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు వాచ్మన్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆ ఆలయంలో పేచ్చిముత్తు (50), శంకరపాండియన్ (65) అనే ఇద్దరు వాచ్మన్లుగా పనిచేస్తున్నారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రత్యేక చిహ్నం కేటాయించాలని కేంద్ర ఎన్నికల కమిషన్కు ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమకు ఓడ, విజిల్, ఆటో, క్రికెట్ బ్యాట్ తదితర 10 గుర్తుల్లో ఒకదాన్ని కేయించాల్సిందిగా మంగళవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించింది.
తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి పోలీసు క్వార్టర్స్లో ప్రైవేటు కంపెనీ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. భీమానగర్ తూర్పు వీధిలో నివసిస్తున్న తామరై సెల్వన్ (27) అనే యువకుడికి యేడాది క్రితం వివాహం జరిగింది. ఆ యువకుడు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజూ బైకుపై ఆఫీసుకు వెళ్ళి సాయంత్రం తిరిగొస్తుంటాడు.
రాష్ట్రంలో 21 ఏళ్ల అనంతరం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) వల్ల దొంగ ఓట్లు వేసేందుకు అవకాశం ఉండదన్న భయంతోనే డీఎంకే వ్యతిరేకిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ఆరోపించారు.
వరుస అల్పపీడనాల ప్రభావంతో.. రాష్ట్రంలో ఈ నెల 16వ తేది నుంచి ‘ఈశాన్య’ రుతుపవనాలు తీవ్రరూపం దాల్చనున్నట్లు వాతావరణ పరిశోధన కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రంలో అక్టోబరు నుంచి ఒకేసారి తీవ్రమైన ఎండ, తీవ్రమైన వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు యత్నిస్తున్నారని డీఎంకే ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు. తూత్తుకుడిలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల ముందు ‘సర్’ అత్యవసరంగా అమలుచేయాల్సిన అవసరం లేదన్నారు.
తిరుపతి వెళ్లే నాలుగు మెము రైళ్లు ఫిబ్రవరి 5వ తేది వరకు తిరుచానూరు వరకు మాత్రమే నడుస్తాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి. అరక్కోణం నుంచి తిరుపతికి ఉదయం 9.15 గంటలకు వెళ్లే రైలు తిరుచానూరు వరకు మాత్రమే వెళ్తుంది. మరుమార్గంలో, అరక్కోణం వెళ్లే మెము సాయంత్రం 3.40 గంటలకు తిరుచానూరు నుంచి బయల్దేరుతుంది.