Home » Chennai News
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి అధికంగా ఉండటంతో ప్రజలు హాప్ బాయిల్డ్ గుడ్డు తింటే అనారోగ్యానికి గురవుతారని, తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు హాఫ్ బాయిల్డ్ తినొద్దని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం హెచ్చరించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన రామనాథపురం జిల్లా రామేశ్వరం-తిరుపతి మధ్య ఇకనుండి వారంలో నాలుగు రోజులు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు రూ.2 వేల చొప్పున పంపిణీ చేసేలా నియోజకవర్గానికి డీఎంకే రూ.20కోట్లు కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఆరోపించారు.
రాష్ట్రంలో మరికొద్ది రోజేల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నా నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అన్నాడీఎంకే పార్టీ బహిష్కృత నాయకురాలు శశికళ అన్నారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు.
ఈసారి నేను అసెంబ్లీలో అడుగుపెట్టడం తథ్యమని, డీఎండీకే పార్టీ ఫీనిక్స్ పక్షి లాంటిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత అన్నారు. ఆమె మాట్లాడుతూ... పడిలేచిన కెరటంలా మళ్ళీ పైకొస్తుందని ఆమె అన్నారు. కొద్దిరోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
చార్మినార్ ఎక్స్ప్రెస్ సహా మూడు ఎక్స్ప్రెస్ రైళ్లు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి చెన్నై బీచ్ స్టేషన్ నుంచి బయలుదేరనున్నాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.
ఊటీలోగల పార్కులో తొలిసారి 1,500 రకాల రోజా మొక్కలు నాటారు. ఇవి ఇక ఏడాది పొడవునా పర్యాటకులకు అహ్లదాన్ని పంచనున్నాయి. పర్యాటకులు నిరాశ చెందకుండా, రోజా పూలు చూస్తూ ఆనందించేలా, ఉద్యానవన శాఖ మొట్టమొదటి సారిగా గ్రీన్ హౌస్లో రోజా మొక్కలు నాటారు.
సంక్రాంతి పండుగ వల్ల ప్రయాణికులు లేకపోవడంతో ఐదు ప్రత్యేక రైళ్లను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణాల నుంచి పెద్దఎత్తున తమతమ స్వస్థలాలకు వెళ్లారు. దీంతో చెన్నై మహానగరం ఖాళీ అయిపోయింది.
అగ్రహీరో, టీవీకే పార్టీ చీఫ్ విజయ్.. ఈనెల 19వతేదీన జరిగే సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. కరూర్లో తొక్కిసలాట జరిగి మొత్తం 41 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 23వతేదీన తమిళనాడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అయితే.. ప్రధాని పర్యటనను తొలుత మదురై పట్టణంలో ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించగా.. దానిని రాజధాని చెన్నైకి మార్చారు. వివరాలిలా ఉన్నాయి.