Home » Chennai News
రాష్ట్రంలోని 14 జిల్లాలకు ‘బర్డ్ ఫ్లూ’ విస్తరించిందని ఆరోగ్యశాఖ తెలిపింది. అడయార్లో జనవరి 5వ తేది వరుసగా కాకులు మృతిచెందాయి.
తనపై అశ్లీలంగా విమర్శలు, వ్యాఖ్యలు చేసిన బీజేపీ స్థానిక నేతకు పోలీసులు మద్దతుగా వ్యవహరించడం గర్హనీయమని కరూర్ కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి ఆరోపించారు.
నీలగిరి జిల్లా ఊటీ షూటింగ్ మట్టమ్ సమీపం చిన్నకడిమందు ప్రాంతంలో పులి దాడిలో ఓ వృద్ధుడు మృతి చెందారు. అటవీ శాఖ అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాను అన్నాడీఎంకేకు ద్రోహం తలపెట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం (ఓపీఎస్) ప్రకటించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత 78వ జయంతి సందర్భంగా తేని జిల్లా బోడినాయకనూరులో ఆమె చిత్రపటానికి మంగళవారం పూలుచల్లి ఓపీఎస్ నివాళులర్పించారు.
ఆంధ్ర రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ప్రబలుతోందని వస్తున్న వార్తలతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ల వద్ద పర్యవేక్షణ తీవ్రతరం చేశారు.
పురపాలక మంత్రిత్వ శాఖలో లంచం తీసుకుని ఉద్యోగ నియామకాలు జరిగా యనే ఆరోపణలు, టెండర్లలో అక్రమాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ విభాగం (ఈడీ) అందించిన ఆధారాల ప్రకారం నగరపాలక శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ తదితరులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఏసీబీకి మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
నగరంలో గుర్రాలు, గాడిదలు పెంచడానికి తప్పకుండా కార్పొరేషన్ నుంచి లైసెన్స్లు పొందాల్సి ఉంటుందని గ్రేటర్ చెన్నై మేయర్ ఆర్ ప్రియా ప్రకటించారు. రిప్పన్భవనం సమావేశ మందిరంలో మేయర్ ప్రియ అధ్యక్షతన శుక్రవారం కార్పొరేషన్ సాధారణ సమావేశం జరిగింది.
‘రీల్స్ వ్యామోహం’ రెండు ప్రాణాలను బలిగొంది. రీల్స్ చేసే ప్రయత్నంలో రైలు ఢీకొని యువకుడు మృతి చెందగా, తీవ్ర మనస్తాపంతో అతని ప్రియురాలు ఆత్మహత్యకు ఒడిగట్టింది. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
ఇంటి దీపమైన తన భార్య క్యాన్సర్ కారణంగా దూరమవుతుందని ఆందోళన చెందిన ఓ వ్యక్తి... ఆమెతో పాటు తనూ తనువు చాలించాలనుకున్నాడు. అయితే తామిద్దరం లేకుంటే తమ ఇద్దరు చిన్నారుల ఆలనా పాలనా చూసేవారుండరన్న భయంతో ఆ ముగ్గురికీ విషమిచ్చి, తానూ ఉరేసుకున్నాడు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 200లకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ధీమా వ్యక్తం చేశారు.