Home » Central Govt
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ.. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ జరిపిన ఈ దాడుల్లో భారతీయ నావికుడు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17వ తేదీ అర్ధరాత్రి 00:01 గంటల నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
అస్సాం వరద ప్రాంతాల్లో ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం పర్యటించింది. వరద తీవ్రత, నష్టాన్ని అంచనావేసింది. శివసాగర్ జిల్లాలో మరో ఏడుగురు మృతి చెందడంతో అస్సాం వరదల కారణంగా చనిపోయిన మొత్తం మృతుల సంఖ్య 75కు పెరిగింది.
కొత్త విద్యా మంత్రిపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలతో మంగళవారం లోక్సభ దద్దరిల్లింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో విద్యాశాఖను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించడంపై ఏఐసీసీ అగ్రనేతలు ప్రియాంక, రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు.
ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ల మీద దర్యాప్తును కొనసాగించవచ్చంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఆదేశాలు.. కేంద్రప్రభుత్వం తమకు ఇచ్చిన హామీకి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పేర్కొంది.
జెన్ జీ ఉద్యమం, కాక్రోచ్లపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారు జెన్ జీ కాదు.. మురికి కాలువల తరం (జనరేషన్ గట్టర్) అని.. కాక్రోచ్లు అనే పేరును సార్థకం చేసుకున్నారని అన్నారు.
ఏపీ పౌరసరఫరాల శాఖలో చేపడుతున్న సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడలో ప్రజా పంపిణీ వ్యవస్థలో స్టీమ్ రైస్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.
ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్తో ఏపీ పౌర సరఫరాల శాఖ కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన 12 ఏళ్లలో బహిరంగ రాజకీయ డిమాండ్కు తలొగ్గి ఒక కేంద్ర మంత్రి తప్పుకోవడం ఇదే మొదటిసారి. 2015లో అప్పటి హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ‘‘మేం ఎన్డీయే. యూపీఏ కాదు. మా మంత్రులు రాజీనామా చేయరు’’ అన్నారు. ఆ తర్వాత..
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తో మంత్రి అచ్చెన్నాయుడు జరిపిన సంప్రదింపులు ఫలించాయి. 2024 ఖరీఫ్ పంటల బీమా పెండింగ్ బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది.