Home » Central Govt
ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తావ అని బీజేపీ(BJP) కేంద్ర నేతలు తనను అడిగారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెడతానని వారికి చెప్పానని అన్నారు. ముందు రాష్ట్రం, ఆ తర్వాత దేశానికి సేవ చేయాలని చెప్పానని తెలిపారు.తన కోసం త్యాగం చేసిన ఉదయ్ను కాకినాడ ఎంపీగా పంపిస్తున్నానని చెప్పారు.
పౌరసత్వ సవరణ చట్టం (CAA) నిబంధనలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. పిటిషన్లపై కేంద్రప్రభుత్వం తన స్పందన తెలియజేయాలంటూ తదుపరి విచారణకు ఏప్రియల్9వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈకేసును విచారించింది.
సింగరేణి మాజీ సీఎండీ ఎన్ శ్రీధర్ (Sridhar) కు కేంద్ర ప్రభుత్వం (Central Govt) షాక్ ఇచ్చింది. ఎన్ఎండీసీ సీఎండీగా శ్రీధర్ నియామక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. గత ఏడాది మార్చి 18వ తేదీన పబ్లిక్ ఎంటర్ ప్రైసెస్ సెలక్షన్ బోర్డ్ సీఎండీ పోస్ట్ కోసం 7 మందిని ఇంటర్వ్యూ చేసింది.
పెండింగ్లో ఉన్నా కృష్ణా రివర్ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తిచేయాలని మాజీ మంత్రి డీకే సరమసింహారెడ్డి (Samarasimha REDDY) కోరారు. సోమవారం నాడు గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కృష్ణనది నుంచి తెలంగాణకు దక్కాల్సిన వాట దక్కడం లేదని చెప్పారు. 800 టీఎంసీలలో మనకు 64 శాతం వాట రావాల్సి ఉందన్నారు.
Andhrapradesh: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు పది సంవత్సరాల తర్వాత ఏపీ భవన్ విభజన అంశం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఏపీ భవన్ను విభజన చేస్తూ శనివారం కేంద్రం హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపీ అంగీకారం తెలిపింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అరెస్ట్కు నిరసనగా రేపు అన్ని నియోజక వర్గాలల్లో ఆందోళనలకు ఆ పార్టీ పిలుపును ఇచ్చింది. కవితనుఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితకు అరెస్ట్ నోటీసులిచ్చిన ఈడీ.. అదుపులోనికి తీసుకుంది. అయితే ఈ విషయంపై మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)ను అరెస్టు చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటుతో మూడు సీట్లు గెలవచ్చని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆశ పెట్టుకున్నారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) అన్నారు. రేపు(శనివారం) ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు కవిత ఇంటి మీద ఐటీ, ఈడీ, సీబీఐ పోలీసులతో మోదీ, అమిత్ షా దాడి చేయించి అరెస్టు జేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా 18 ఓటీటీ ప్లాట్ఫారమ్లపై నిషేధం విధించింది. దీంతోపాటు 19 వెబ్సైట్లు, 10 యాప్లు, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్ను కూడా ప్రభుత్వం బ్లాక్ చేసింది. అయితే ఎందుకు ఇలా చేసింది, కారణాలు ఏంటనేది ఇక్కడ చుద్దాం.
ప్రజలపై శునకాల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 23 జాతుల క్రూరమైన శునకాల పెంపకంపై నిషేధం విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్రలో రైతులు, పేదల కష్టాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ. వి హనుమంతరావు (V. Hanumanthao) తెలిపారు. సోమవారం నాడు ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ చెప్పారని అన్నారు.