Home » Central Govt
పీఎం సూర్యఘర్ పథకం కింద తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ ప్యానెల్స్ కుంభకోణం జరిగిందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి మంగళవారం రఘునందన్ రావు ఢిల్లీలో ఫిర్యాదు చేశారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు.
దేశంలో నగర వైమానిక రవాణా రంగంలో ఒక సరికొత్త శకానికి తెరలేవబోతోంది. 2028 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.
యూపీఐ యూజర్లకు ఎలాంటి ఛార్జీలు ఉండబోవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. P2P యూపీఐ లావాదేవీలు ఎప్పటిలాగే ఉచితమని క్లారిటీ ఇచ్చింది.
పార్లమెంట్లో ఎంఎస్ఎంఈ సవరణ బిల్లు 2026కు ఆమోదించడంపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వాగతించారు. నూతన చట్టంతో ఎంఎస్ఎంఈ రంగానికి బలమైన రక్షణ, 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.
చిన్న తరహా పరిశ్రమలు, చేతివృత్తుల కళాకారులు, రైతులు, మత్స్యకారుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు పెంచేందుకు వీలుగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సవరించింది.
వైజాగ్ రైల్వే జోన్ రికార్డు స్థాయిలో పురోగతి సాధించిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. వార్షికంగా రూ.2,493 కోట్ల ఆదాయంతో దేశంలోనే అత్యుత్తమ జోన్గా సౌత్ కోస్ట్ రైల్వే నిలిచిందని పేర్కొంది.
ఆయుశ్కు కేంద్రప్రభుత్వం భారీ ప్రాధాన్యం ఇస్తోందని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఆయుశ్ బడ్జెట్ రూ.1,070 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలుకీలక అంశాలపై మంత్రులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు.
సీడబ్ల్యూసీ అనుమతుల తర్వాత పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీడబ్ల్యూసీ స్పష్టత, అంతర్రాష్ట్ర అనుమతులు పొందిన తర్వాత కొత్త ప్రతిపాదన పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది.