Home » Central Govt
Thummala Letter: అరకొర సరఫరా కారణంగా రాష్ట్రంలో దాదాపు 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. తాజాగా జులై నెలకు నిర్దేశించిన సప్లై ప్లాన్ ప్రకారం రాష్ట్రానికి 1.60 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉందన్నారు.
GST Slashed: 12 శాతం శ్లాబ్లో మార్పులు తీసుకువస్తే కేంద్ర ప్రభుత్వంపై వేల కోట్ల భారం పడనుంది. దాదాపు 40 వేల కోట్ల నుంచి 50 వేల కోట్ల ఆర్థిక భారం పడనుంది.
మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1.07 లక్షల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఇది మ్యాన్యుఫ్యాక్చరింగ్-డ్రైవెన్ ఎకానమీకి కీలక గ్రోత్ ఇంజన్ అని గత బడ్జెట్లో వైష్ణవ్ ప్రకటించారు.
ఏపీ గ్రీన్ ఎనర్జీలో చాలా బలంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీకి ఎన్నో అడ్వాంటేజీలు ఉన్నాయని, శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ ఇక్కడే ఉందని తెలిపారు. ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు.
డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుని కలిసి పలు ప్రాజెక్ట్లపై కూడా చర్చించామని తెలిపారు. ఇరిగేషన్, టూరిజం అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని వెల్లడించారు.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎ్ఫవో) తన చందాదారులకు శుభవార్త చెప్పింది. పీఎఫ్ సభ్యులు ఆటో సెటిల్మెంట్ పద్ధతిలో విత్డ్రా చేసుకునే సొమ్ము పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎలాంటి ప్రాణహాని, ముప్పు లేదని కేంద్ర ఇంలిటిజెన్స్ బ్యూరో నివేదిక సమర్పించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ నివేదించింది.
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్కు జూన్ 26వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎంపీ పురందేశ్వరీ హాజరుకానున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటనతో ఏపీ అభివృద్ధి కుంటుపడిందని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో నిధులు మళ్లించి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో రెవెన్యూ రికార్డులను అస్తవ్యస్థం చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.
గోదావరి నదీ జలాల వివాదాలపై కొత్త ట్రిబ్యునల్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే తెరపైకి గోదావరి ట్రిబ్యునల్ వచ్చింది.