Home » Central Govt
జేపీ నేతల మూర్ఖపు మాటలతో బీజేపీ బలపడదని తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికారు. నెలాఖరులోపు తెలంగాణకు కేటాయించాల్సిన యూరియా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం చేతకానితనంతోనే తెలంగాణకు యూరియా కష్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృషి ఫలిస్తోంది. విశాఖపట్నంలో డాటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విశాఖపట్నంలో డాటా సిటీ ఏర్పాటుకు మద్దతునిచ్చే అంశాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఆన్లైన్ బెట్టింగ్ను అరికట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో బెట్టింగ్ను నేరంగా పరిగణిస్తూ ఆన్లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం బుధవారం జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బహిరంగ లేఖ రాశారు. జీఎస్టీ స్లాబ్ రద్దు లేదా మార్పు అంటూ కేంద్రం గత వారం రోజులుగా ప్రచారం చేసుకుంటుందని చెప్పుకొచ్చారు. వీటి ద్వారానే ప్రజల జీవితాల్లో నిజమైన దీపావళి వస్తుంది అంటూ ప్రాపగాండ చేస్తుందని విమర్శించారు.
దేశంలో ఈ మధ్య కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మోసాలు బాగా పెరిగిపోయాయి. దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో ఆన్లైన్ గేమింగ్ను నియంత్రించేందుకు కొత్త బిల్లును యూనియన్ క్యాబినెట్ ఆమోదించింది.
కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం కలిశారు. కాంగ్రెస్ ఎంపీల ఫోరమ్ చైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో మంత్రి జేపీ నడ్డాను ఎంపీలు కలిశారు. ఈ వారంలో 62 వేల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి 1969లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2005లో సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఓ విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకున్న ఘటన శంషాబాద్ ఎయిర్పోర్టులో జరిగింది. హైదరాబాద్ - తిరుపతి బయలుదేరిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో టేకాఫ్ తర్వాత పైలెట్ సాంకేతిక లోపం గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ఢిల్లీలో సోమవారం పర్యటిస్తున్నారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి పనులపై పలువురు కేంద్రమంత్రులను లోకేష్ కలుస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో నారా లోకేష్ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు – మచిలీపట్నం నడుమ ఆరులైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు.
మన దేశంలో చిన్న విషయాలకు జైలు శిక్ష విధించే చట్టాలు ఉన్నా.. వాటిని ఎవరూ ఎప్పుడూ పట్టించుకోలేదని పియూష్ గోయల్ తెలిపారు. భారతీయులను జైలులో పెట్టే అటువంటి అనవసరమైన చట్టాలను రద్దు చేసే బాధ్యతను తాను స్వయంగా తీసుకున్నట్లు పేర్కొన్నారు.