Home » Central Govt
భారత ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 17 చీకటి రోజని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి తల్లి, అక్కా, చెల్లి, కుమార్తెకు ఈరోజు అవమాన దినమని పేర్కొన్నారు.
లోక్సభలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. విపక్ష నేతలందరూ ఏకమై ఒక ‘జాతీయ విపత్తును’ నివారించారని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కేంద్ర క్యాబినెట్ అత్యవసర భేటీ కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం ఉదయం 11:30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
నారీ శక్తీ వందనం బిల్లుపై పార్లమెంట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అత్యంత బాధ్యత రహితంగా మాట్లాడారని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సాధికారిత బిల్లుపై, మహిళల అభివృద్ధి గురించి మాట్లాడమంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అవహేళనగా మాట్లాడారని ధ్వజమెత్తారు.
బీజేపీ చేసే డీలిమిటేషన్ వల్ల సౌత్ రాష్ట్రాలకు 66 సీట్లు పెరిగితే - నార్త్ రాష్ట్రాలకు 190 సీట్లు దాటుతున్నాయని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వివరించారు. 50 శాతం ప్రకారం సీట్ల పెంపు చేస్తే భవిషత్తులో దక్షిణ రాష్ట్రాల అవసరం లేకుండా పోతుందన్నారు.
దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు ఈరోజు(గురువారం) బిగ్ డేగా నిలవనుంది. కొత్త పార్లమెంట్ భవన సామర్థ్యానికి అనుగుణంగా ఎంపీల సంఖ్య పెంపుదల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను సాధ్యమైనంత వేగంగా అమలు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కావాలనే అసత్య ప్రచారానికి తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు విమర్శించారు. సీట్ల పెంపు అనేది 2011 జనాభా లెక్కల ఆధారంగానే జరుగుతుందని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు.
దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, ఎంపీ సీట్ల పెంపుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో.. ఒక సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. ఎంపీల సంఖ్య పెంచడం కంటే, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువగా ఉండే రాష్ట్రాల ఎమ్మెల్యేల సంఖ్యను పెంచితే సరిపోతుంది కదా? అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా డీలిమిటేషన్ జరిగితే అది కేవలం ఒక రాజకీయ ప్రక్రియగానో లేక చట్ట సవరణ గానో మిగిలిపోదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు.