Home » Central Govt
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ఢిల్లీలో సోమవారం పర్యటిస్తున్నారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి పనులపై పలువురు కేంద్రమంత్రులను లోకేష్ కలుస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉపరితల రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో నారా లోకేష్ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు – మచిలీపట్నం నడుమ ఆరులైన్ల రోడ్డు విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీచేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు.
మన దేశంలో చిన్న విషయాలకు జైలు శిక్ష విధించే చట్టాలు ఉన్నా.. వాటిని ఎవరూ ఎప్పుడూ పట్టించుకోలేదని పియూష్ గోయల్ తెలిపారు. భారతీయులను జైలులో పెట్టే అటువంటి అనవసరమైన చట్టాలను రద్దు చేసే బాధ్యతను తాను స్వయంగా తీసుకున్నట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరవాసులకు చల్లని కబురు వినిపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు ఊరటనిచ్చే వార్త వెల్లడించారు. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో.. సిటీలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను పూర్తి ఏసీ కోచ్లుగా మార్చనున్నట్లు ప్రకటించారు.
బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ల ఆమోదానికి గడువు విధించే అధికారం కోర్టుకు ఉండదని కేంద్రం సుప్రీంకోర్టుకు విన్నవించింది. కొన్ని అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటే రాజ్యాంగపరంగా గందరగోళం తలెత్తే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది.
గత నెల 28న పట్ట పగలే వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కిరాయి మూకలు చేసిన హత్యాకాండకు విశ్వవిద్యాలయం ఉలిక్కిపడింది. మోటార్ సైకిల్ పై వెళుతున్న శ్రీరామచంద్రమూర్తిని వెనక వైపు నుండి గుద్ది కింద పడేశారు. ఆ తర్వాత విచక్షణా రహితంగా దాడి చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఏపీకి కొత్త ప్రాజెక్టులు కేటాయించి, తెలంగాణను పక్కన పెడుతోందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్ యూనిట్ను ఏపీకి తరలించారని మండిపడ్డారు.
ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్ విచారణ కొనసాగించారు. గతంలో బీహార్లో నిర్వహించిన సమ్మరీ రివిజన్లో ఏడు ధ్రువపత్రాలను మాత్రమే అనుమతించారని పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు బుధవారం లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని హరీష్రావు లేఖలో పేర్కొన్నారు.
ఎన్టీఆర్- పీఎంఏవై(నందమూరి తారక రామారావు- ప్రధాన మంత్రి ఆవాస్ యోజన) ఇళ్లకు మోక్షం కలగటం లేదు. ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వటంలో అంతులేని తాత్సారం జరుగుతోంది. దీంతో ఇళ్లు కట్టుకోలేక ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
లక్నో ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించడంలో ఇదొక మైలురాయి అని, ఫేజ్-1బి వినియోగంలోకి రాగానే లక్నోకు 34 కిలోమీటర్ల మేర యాక్టివ్ మెట్రో నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.