Home » Central Govt
ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకురాగలిగే పీఎం సూర్య ఘర్ పథకం ప్రారంభించటం చాలా ఆనందంగా ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కోటి గృహాలకు ఉచిత విద్యుత్ అందించాలనే మహత్తర లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకం కాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న(శనివారం) సాయంత్రం మహిళల గురించి మాట్లాడారని తెలిపారు.
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.
హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీని పిలిపించి అధికారికంగా నిరసన తెలియజేయనుంది.
పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవడం చీకటి రోజని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు వీగిపోయిందని కాంగ్రెస్ వీర్రవీగుతోందని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాలలో పాల్గొననున్న మీటింగ్పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. బయటకు వస్తే పులి సంగతి చెబుతామని హెచ్చరించారు.
నియోజకవర్గాల పునర్విభన బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు పార్లమెంట్లో వీగిపోవడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ బిల్లులను అడ్డుకోవడం చారిత్రాత్మక తప్పిదమని పేర్కొన్నారు.
దేశంలోని లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. డియర్నెస్ అలవెన్స్ (DA)ను 2 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర రైల్వేశాఖ ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అత్యంత రద్దీగా ఉండే చెన్నై - హౌరా ప్రధాన మార్గంలో భాగంగా, నిడదవోలు నుంచి దువ్వాడ వరకు మూడు, నాలుగో రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందని పేర్కొన్నారు.