Home » Case
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై సుబేదారి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. హనుమకొండలో బుధవారం ‘రైతు సంగ్రామ సదస్సు’ను బీఆర్ఎస్ నేతలు నిర్వహించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రచారంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా చేసిన హింసాత్మక వ్యాఖ్యలపై లీగల్ కేసు వేయనున్నట్టు పశ్చిమబెంగాల్ మమతా బెనర్జీ తెలిపారు.
భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారో వ్యక్తి. టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం సంబరాల్లో భాగంగా హార్దిక్ మువ్వన్నెల జెండాను అవమానించాడని ఫిర్యాదుదారు ఆరోపించారు.
నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ వేసిన ఆయన భార్య సంగీత తాజాగా మరో పిటిషన్ వేశారు. నివాస హక్కులు కోరుతూ ఈ పిటిషన్ వేశారు.
ముందస్తు అనుమతులు లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించినందుకు రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్లో సాక్షి యాజమాన్యంపై కేసు నమోదైంది. గత నెల 8న ప్రచురితమైన ఓ పత్రికా కథనం ఇందుకు కారణం. పత్రికా యాజమాన్యం, సిబ్బందిపై చర్యలు చేపట్టాలని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
అమిత్షాపై మహువా మొయిత్రా వ్యక్తిగత విమర్శలకు దిగారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అడ్డుకోవడంలో షా విఫలమయ్యారన్నారు. ఆయన తలను నరికి బల్లపై పెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మొబైల్ ఫోన్ లోకేషన్ నేరం జరిగిన సమయంలో అక్కడే ఉన్నట్లు తేలింది. సెక్యూరిటీ గార్డుకు యువతిపై లైంగిక దాడి దాడి జరుగుతున్నట్లు తెలుసు. అతడు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిపోయి గార్డు రూముకు లాక్ వేశాడు.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నానిపై విజయవాడలో ఆదివారం నాడు మరో కేసు నమోదైంది. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఫతావుల్లా, ఆషాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్ విధిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యల కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని ఏపీ హైకోర్ట్ తేల్చిచెప్పింది.