Home » Business news
ఏప్రిల్ 1న బ్యాంకుల వార్షిక ఖాతాల ముగింపు సందర్భంగా సెలవు ఉండనుంది. ఏప్రిల్ 2న మౌనీ గురువారం సందర్భంగా కేరళలో సెలవు ఉండనుంది. ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.
ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు సాగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం స్టాక్ మార్కెట్లలో జోష్ తీసుకొచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా చర్చల పట్ల సానుకూలంగా ఉన్నట్టు వార్తలు రావడంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా తగ్గింది.
నిన్నటి భారీ పతనం తర్వాత ఇవాళ భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సెన్సెక్స్ సూచీ ఏకంగా 1,500 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 22,900 మార్కు చేరువలోకి వెళ్లింది. పెట్టుబడిదారుల సంపద కొన్ని గంటల్లోనే లక్షల కోట్లు పెరిగిపోయింది.
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు.. ముడిచమురు సెగలతో మార్కెట్లు మలమల మాడిపోతున్నాయి. నాలుగో వారంలోకి ప్రవేశించి న యుద్ధం ఇప్పట్లో ఆగకపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలను...
ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇతర ఇంధన మౌలిక వసతులపైౖ దాడుల ప్రణాళికను 5 రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో...
డాలర్ మారకంలో రూపాయి సోమవారం సరికొత్త కనిష్ఠానికి జారుకుంది. రూపాయి విలువ ఒకదశలో 50 పైసలు క్షీణించి రూ.94.03 వద్దకు చేరింది. రూపాయి మారకం రేటు రూ.94 దాటడం ఇదే...
అడల్ట్ కంటెంట్ ప్లాట్ఫామ్ ‘ఓన్లీ ఫ్యాన్స్’ యజమాని లియోనిడ్ రాడ్విన్స్కీ మృతిచెందారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన సోమవారం కన్నుమూశారు.
ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల బాటలోనే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ కూడా భారీ నష్టాలను చవిచూశాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (93.97) జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది.
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ స్టాక్ మార్కెట్ను భారీ దెబ్బ తీశాయి. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాటు, చమురు సరఫరాపై పడే ప్రభావం ఇన్వెస్టర్లలో వణుకు పుట్టించింది. ఫలితంగా సోమవారం ట్రేడింగ్లో నిఫ్టీ, సెన్సెక్స్ భారీ పతనాన్ని నమోదు చేశాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) త్వరలో ముగుస్తోంది. ఇంకా పది రోజుల సమయమే ఉంది. చాలా మంది ఇంకా తమ ట్యాక్స్ ప్లానింగ్ పెట్టుబడులు పూర్తి చేసి ఉండరు. ఈ పది రోజుల్లో ఈ పనులు....