Home » BRS
తెలంగాణలో కోటీ యాభై లక్షల టన్నుల ధాన్యం పండించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 75 లక్షల టన్నుల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.
మహిళా శక్తి పథకం కింద 553 బస్సులు పంపిణీ చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ అని పేర్కొన్నారు.
అంగన్వాడీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీతాలు చెల్లించడం లేదంటూ బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని రేవంత్ మభ్యపెడుతున్నారని ఆగ్రహించారు.
ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర మంత్రివర్గం 18 గంటలు పనిచేస్తుంటే... బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఏదో ఒక అభాండం వేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సన్నబియ్యం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.
సీఎం రేవంత్రెడ్డిపై.. మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిట్లర్ను చూసి హైడ్రా పెట్టానని అంటావా....? కళ్లు నెత్తికి ఎక్కాయా..? అని ధ్వజమెత్తారు.
జహీరాబాద్లో బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించారని.. కానీ డీపీఆర్లో బుల్లెట్ ట్రైన్ ఎందుకు లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ విషయంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి అష్టదరిద్రులు అడ్డం పడుతున్నారని ధ్వజమెత్తారు. కాళ్లలో కట్టెలు పెట్టినా.. మూసీలో పడి దొర్లినా వాళ్లను పట్టించుకోమని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కిరణ్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీటింగ్కి అనుమతి ఇస్తే ఏమవుతుంది? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశ్నించారు. పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పడూ మాట్లాడలేదని అన్నారు..
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కచ్చితంగా ఇక్కడి భూమి పుత్రుల జాగీరే అని స్పష్టం చేశారు.