Home » BRS
గురుకులాల నిర్వహణ, అవినీతి ఆరోపణల అంశంపై గన్పార్క్ దగ్గర మంత్రులతో చర్చకు బీఆర్ఎస్ సిద్ధమైంది. మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ నుంచి గన్పార్క్కు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు.
గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు తాము సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం గన్పార్క్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉందని, అందుకే వారు బహిరంగ చర్చకు ముందుకు వచ్చారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మంత్రులు పూర్తిగా, పారదర్శకంగా పనిచేస్తున్నారని తెలిపారు.
తెలంగాణలో ప్రభుత్వ అప్పులు, గురుకులాల టెండర్లపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.
బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది.
రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పులు రూ.2.80లక్షల కోట్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు.
రేవంత్రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని.. రెన్యువల్ సీఎం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సెటైర్లు వేశారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి సర్కార్ ఇందిరమ్మ రాజ్యమంటూనే పేదల ఇళ్లు కూలగొడుతోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వమైనా పేదలకు అండగా నిలిచి వాళ్లకు గూడు కట్టిస్తుందని తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజలను చూసుకుంటే... కాంగ్రెస్ నేతలు పెద్దలను చూసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిన అబద్దాలను నమ్మి.. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టంకట్టారన్నారు.
SIR పేరిట దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. నాడు ఓటును జోడించే కార్యక్రమం జరిగితే.. నేడు ఓటును తొలగించే కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు.