Home » BRS
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం శనివారం నుంచి హోరెత్తనుంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో ప్రచారంలో స్పీడ్ పెంచాలని అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.
జూబ్లీహిల్స్ బైపోల్స్ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనటంపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవటమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బైపోల్ నామినేషన్ల ఘట్టమే రసకందాయమైంది. మొత్తం 211 మంది అభ్యర్థులు ఈ ఉపఎన్నికకు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత.. కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ నామినేషన్పై అభ్యంతరాలు..
కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. బుధవారం సిద్ధిపేటలో ఆయన పర్యటించారు. పట్టణంలోని 7వ వార్డులోని కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు.
బీఆర్ఎస్ అభ్యర్థి సునీత నామినేషన్ను రద్దు చేయాలని మాగంటి గోపీనాథ్ మొదటి భార్య తనయుడు ప్రద్యుమ్న ఈసీకి ఫిర్యాదు చేశాడు. గోపీనాథ్ భార్య మాలిని అని.. సునీత కాదని ఆరోపించారు. మాలినితో గోపీనాథ్కు విడాకులు అవ్వలేదని ప్రద్యుమ్న పేర్కొన్నాడు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ నియమించింది బీఆర్ఎస్ పార్టీ. అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా.. 40 మంది సీనియర్ నేతల పేర్లను విడుదల చేసింది.
హరీష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి డిమాండ్ చేశారు. కేబినెట్ మంత్రులను దండుపాళ్యం బ్యాచ్ అంటారా అంటూ ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా 450 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తే హైదరాబాదులో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని హరీశ్ రావు చెప్పారు. తమ హయాంలో 110 రకాల మందులు ఉచితంగా అందించే వాళ్ళమని పేర్కొన్నారు. 130 రకాల పరీక్షలను ఉచితంగా చేసి పేషంట్ల ఫోన్ లకే రిపోర్టులు పంపించే వాళ్ళమని చెప్పారు.
రాజయ్య ఎవరికి ఫోన్ చేయబోయి ఎవరికి చేస్తే... మంత్రి పదవి ఊడిందో తెలియదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్స్ చేశారు. రాజయ్యను తొలగిస్తే ఆయన తరఫున తాము మాట్లాడామని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రే హోంమంత్రి అయ్యుండి కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయని హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైందని వ్యాఖ్యలు చేశారు.