Home » BRS
కాళేశ్వరం అవినీతి విచారణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం విఫలమైందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం అవకతవకలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యిందన్నారు.
ఘోష్ కమిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పుతో తమకేదో లాభం చేకూరిందని బీఆర్ఎస్ భావిస్తోందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తెలిపారు. బీఆర్ఎస్ నేతలు అప్పుడే చంకలు గుద్దుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు.
భారత రాష్ట్ర సమితి మరో ముఖ్యమైన సమావేశానికి సిద్ధమవుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం, రజతోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
కేసీఆర్ స్థాయి.. రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు తెలుసని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని తెలిపారు. జగిత్యాల సభలో కేసీఆర్ హుందాగా మాట్లాడారని చెప్పుకొచ్చారు.
జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి శనిలా మారారని జీవన్ రెడ్డి ఆరోపించారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్కు కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది రాహుకేతు గ్రహమని బండి సంజయ్ అంటున్నారని.. అసలు బండి సంజయ్ ఏ గ్రహమని ఎద్దేవా చేశారు.
కల్వకుంట్ల కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం మాత్రమే వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుందని ఆరోపించారు.
ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం, ప్రతిపక్షం సభలు పెట్టాయంటూ కవిత మండిపడ్డారు. ప్రతిపక్షం ఉట్టికథలు చెబితే.. ప్రభుత్వం పిట్టకథలు చెప్పిందంటూ వ్యాఖ్యానించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 95 శాతం పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ నేతలకు మంత్రి వాకిటి శ్రీహరి సవాల్ విసిరారు.