Home » BRS
కేసీఆర్ పాలనలో కరెంట్ వెలుగులు వెనుక అవినీతి చీకటి గుట్టురట్టు కానుందా..? కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేసిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ క్విడ్ ప్రో కో ఊబిలో చిక్కిందా?. ఈ కథనంలో చూద్దాం.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయంలో అమరవీరులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల పాలైందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి కేటీఆర్పై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లుగా కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం ఆ మాట ఎప్పుడు ఆనలేదని తేల్చిచెప్పారు.
సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిస్కంలు పెడతామని సీఎం ఎలా అంటున్నారని ప్రశ్నించారు.
ఇద్దరు కీలక నేతల వ్యాఖ్యలు హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నిరాశను ప్రతిబింబిస్తున్నాయి.
బీజేపీ నాయకులు చేసేది దద్దమ్మల యాత్ర అని ప్రభుత్వ విప్ వేముల వీరేశం వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు డ్రామా చేస్తున్నారని.. యాత్రలు చేసే వాళ్లు వస్తుంటారు, పోతుంటారని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్లపేరుతో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి సర్కార్ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్ సిటీలో 24 గంటల పాటు తాగునీటిని సరఫరా చేస్తామని కేటీఆర్ అన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చిన తీరుగానే ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది కోట్లు పెడతామని మల్టీ నేషనల్ కంపెనీలు వస్తున్నాయని.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే పెట్టుబడిదారులు భయపడరా అని మండిపడ్డారు.