Home » BJP
మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మరో మూడు కీలక బిల్లులపై లోక్సభలో సుదీర్ఘ చర్చ ముగిసింది. ఈ సందర్భంగా అమిత్ షా ప్రతిపక్ష 'ఇండి' (INDIA) కూటమి లక్ష్యంగా ఘాటైన విమర్శలు చేశారు.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటులో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అంశంపై ఆయన ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యవహారం చర్చనీయాంశమైంది.
నారీ శక్తీ వందనం బిల్లుపై పార్లమెంట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అత్యంత బాధ్యత రహితంగా మాట్లాడారని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సాధికారిత బిల్లుపై, మహిళల అభివృద్ధి గురించి మాట్లాడమంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అవహేళనగా మాట్లాడారని ధ్వజమెత్తారు.
పార్లమెంట్ సమావేశాలకు బీజేపీ ఎంపీలంతా తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఈ మేరకు విప్ జారీ చేసింది.
పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రసంగంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబె స్పందించారు. ఏప్రిల్ 17 గురించి రాహుల్ ప్రస్తావించడాన్ని తప్పుబట్టడమే కాకుండా.. కులగణన గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదన్నారు.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య విషయంలో చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. ఈ లేఖపై డీజీపీ స్పందించారు.
పార్లమెంట్లో తెలంగాణ విభజనను ఎంపీ తేజస్వి సూర్య అవమానిస్తుంటే టీబీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట విభజన సమయంలో కాంగ్రెస్ తప్పిదాలతో యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఎంపీ తేజస్వి సూర్య చెప్పారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. 2009లో కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు సహకరించి మళ్లీ వెన్నక్కి తగ్గారని.. దీని గురించే తేజస్వి సూర్య మాట్లాడారని అన్నారు.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు స్పందించారు. సూర్య వ్యాఖ్యలపై అర్థంపర్థం లేకుండా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారంటూ ఆయన ఫైరయ్యారు.
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్-భారత్ విభజనతో పోల్చడం దుర్మార్గమని నిరంజన్ రెడ్డి విమర్శించారు. భారత రాజ్యాంగానికి లోబడి, పార్లమెంట్ ఆమోదంతో తెలంగాణ ఏర్పడిందని తెలిపారు.