Home » BJP
గాలి జనార్దన్ రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగేంద్ర ధ్వజమెత్తారు. కాలు దువ్వి.. కాంగ్రెస్ వారితో రగడకు దిగారంటూ ఆయన ఆరోపించారు. కాగా.. బళ్లారిలో నిన్న జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపుతోంది.
విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారని మాజీమంత్రులు శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ... యువకుడి మరణానికి కారణమైన బుల్లెట్ ఎవరి గన్ నుంంచి వచ్చిందో పోలీసుల విచారణలో తేలిపోతుందని అన్నారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, క్యాబినెట్ మంత్రి ధర్మపాల్ సింగ్ ఏర్పాటు చేసిన సమావేశంలో శ్యామ్ బిహారీ లాల్ పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
వైసీపీ పాలనలో జరిగిన సర్వేలో లోపాలు రైతుల పాలిట శాపాలుగా మారాయి. కూటమి ప్రభుత్వం గ్రామ సభలు పెట్టినా, మూడు విడతలు రీసర్వే నిర్వహించినా పరిష్కారం కాలేదు. శుక్రవారం నుంచి నాల్గవ విడత రీసర్వేకు రంగసిద్ధమైంది.
ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు మూడు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రిని టీఎంసీ బాస్ బెదిరించారని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర తప్పుపట్టారు. తాము తలుచుకుని ఉంటే మమతా బెనర్జీని ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన చోటు నుంచి బయటకు అడుగు పెట్టకుండా చేసేవాళ్లమని అన్నారు.
భారతీయ జనతా పార్టీకి చెందిన నేత కుమారుడొకరు ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకొని తీరా గర్భం దాల్చాక మోహం చాటేసిన విషయం కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
కాంగ్రెస్, బీఆర్ఎస్లు తోడుదొంగలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... విలువలతో కూడిన రాజకీయం చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని, త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సహితం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీద వాడి గోడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పట్టడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే పేద వాడి పార్టీ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్లో మనం ఉండటం మన అదృష్టమని తెలిపారు.
చమట చుక్కకు ఓటమి లేదని.. ప్రస్తుతం పేదల శ్రమకు అన్యాయం జరుగుతోందని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కోసం సీఐటీయూ గొంతెత్తి పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం అవుతున్నాయని విమర్శించారు.
బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ కల్పించాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కోరారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దారుణాలపై ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు.