Home » BJP
బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని TMC పతనానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 'RG Kar అత్యాచారం-హత్య' కేసు విషయంలో వ్యవహరించిన తీరు, పనితీరులో వైఫల్యం, గూండాయిజం, ముఖ్యంగా GenZ, GenX తరం తీవ్ర అసంతృప్తితో రగిలిపోవడం కీలకమైంది.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ (BJP) హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. హిమంత సైతం తన సొంత నియోజకవర్గమైన జలుక్బరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 89,000 పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు.
అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ అధికారం నిలబెట్టుకోగా.. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చరిత్రాత్మకమని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్కు షాక్ తగిలింది. జోర్హాట్లో బీజేపీ సీనియర్ నేత హితేంద్రనాథ్ గోస్వామి చేతిలో 28వేల ఓట్లకు పైగా తేడాతో గొగోయ్ ఓటమి పాలయ్యారు.
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. దీంతో కమలం పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.
వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకు సాగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్ నాయకత్వంపై ప్రజలకు గట్టి నమ్మకం ఉందని వెల్లడించారు.
వెస్ట్ బెంగాల్, అస్సాంలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంపై ఏపీలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అస్సాంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. వెస్ట్ బెంగాల్లో ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారని తెలిపారు.
కోల్కతాలోని ఒక ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం రాత్రి నాలుగు గంటల సేపు ఉండటం, తెల్లవారుజామున 12.07 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోవడంపై ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలకు మందు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆమె కదలికలపై తాము నిఘా ఉంచినట్టు చెప్పారు.
గత ఐదేళ్లుగా రాష్ట్రాభివృద్ధికి నిధులివ్వకుండా, రాష్ట్ర హక్కులను హరించివేస్తున్న బీజేపీ పాలకులకు కట్టుబానిసలుగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామిని, ఏఎంఎంకే నేత దినకరన్ను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని పోలింగ్ ఏజెన్సీ టుడేస్ చాణక్య వెల్లడించింది. మెుత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 192 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపింది.