Home » Bihar
బిహార్లోని మధుబని జిల్లా బేనిపట్టికి చెందిన మైథిలీ ఠాకూర్ ఇటీవల బీజేపీలో చేరారు. అవకాశం వస్తే తన సొంత నియోజకవర్గం నుంచి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని చెప్పారు. మైథిలీ ఠాకూర్ను బిహార్ 'స్టేట్ ఐకాన్'గా కూడా ఎన్నికల కమిషన్ గతంలో నియమించింది.
తేజస్వి యాదవ్ రఘోపూర్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు. హ్యాట్రిక్ గెలుపును ఆశిస్తున్నారు. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోపాటు బిహార్ను అభ్యుదయపథంలోకి తీసుకువెళ్లాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జేడీయూ తొలి జాబితాను నితీష్ కుమార్ ప్రకటించారు. సానాబార్సా నుంతి రత్నేష్ సదా, మోర్వా నుంచి విద్యాసాగర్ నిషద్, ఎక్మా నుంచి ధుమాల్ సింగ్, రాజ్గిర్ నుంచి కౌశల్ కిషోర్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.
జన్సురాజ్ పార్టీ ఇంతవరకూ 116 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీఎం నితీష్ కమార్ కంచుకోటగా భావించే హర్నాట్ నియోజకవర్గం నుంచి కమలేష్ పాశ్వాన్ను బరిలోకి దింపింది.
సీట్ల పంపకాలపై విపక్ష మహాకూటమిలో అనిశ్చితి కొనసాగుతోంది. మహాకూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చర్చలు ఇంకా కొనసాగుతుండటంతో అధికారిక ప్రకటనలో జాప్యం చోటుచేసుకుంది.
హెచ్ఏఎం అభ్యర్థుల్లో దీపా కుమారి (ఇమామ్ గంజ్), అనిల్ కుమార్ (తెకరి), జ్యోతి దేవి(బరచాటి), రోమిత్ కుమార్ (అత్రి), ప్రఫుల్ కుమార్ సింగ్ (సికింద్రా), లలన్ రామ్ (కుటుంబ) ఉన్నారు.
'ఇండియా' కూటమి భాగస్వాములకు సీట్ల కేటాయింపుపై ఆర్జేడీ మరికొద్ది గంటల్లోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. రఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వి బుధవారంనాడు నామినేషన్ వేయనున్నట్టు చెబుతున్నారు.
తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సామ్రాట్ చౌదరి పోటీ చేయనుండగా, లఖిసరాయ్ నుంచి విజయ్ సిన్హా పోటీ చేయనున్నారు. లఖిసరాయ్ నియోజకవర్గానికి నాలుగుసార్లు విజయ్ సిన్హా ప్రాతినిధ్యం వహించారు. 2005, 2010, 2015, 2020లో ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారు.
హెచ్ఏఎం (సెక్యులర్)తో పాటు సీట్ల షేరింగ్లో భాగంగా రాజ్యసభ ఎంపీ ఉపేంద్ర కుష్వాహ రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM)కు కూడా ఆరు సీట్లు దక్కాయి. రాష్ట్రంలో బిగ్ బ్రదర్ ఎవరనే ప్రసక్తి లేకుండా జేడీయూ, బీజేపీ చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి.
బిహార్లో ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి భారీ షాక్ తగిలింది. ఐఆర్సీటీసీ హోటల్స్ నిర్వహణ టెండర్స్ కేసులో కోర్టు లాలూ, ఆయన కుటుంబంపై అవినీతి, నేరపూరిత కుట్ర అభియోగాలను మోపింది.