Share News

Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్

ABN , Publish Date - Sep 12 , 2025 | 02:47 PM

ఈ పరిణామంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి తల్లిని కాంగ్రెస్ అవమానపరచడం గర్హనీయమని అన్నారు. ప్రధాని తల్లి అందరికీ తల్లి అని, ఆమెను అవమానపరిచిన కాంగ్రెస్‌కు బిహార్ ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు.

Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో..  బీజేపీ ఫైర్

పాట్నా: బిహార్ కాంగ్రెస్ (Bihar Congress) మరోసారి వివాదంలో చిక్కుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), ఆయన దివంగత మాతృమూర్తి హీరాబెన్ మోదీ (Heeraben Modi) పోలికలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో రూపొందించిన వీడియోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. 36 సెకెండ్ల ఈ వీడియో ఆన్‌లైన్‌‌లో వైరల్ అవుతోంది. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ తరహా వీడియోను కాంగ్రెస్ విడుదల చేయడం వ్యక్తిగత దాడిగా బిజేపీ (BJP) నిప్పులు చెరిగింది.


'సాహబ్ కలలోకి అమ్మ వచ్చింది' (Maa appears in Sahab's dreams) అనే శీర్షికతో బిహార్ కాంగ్రెస్ ఈ వీడియోను విడుదల చేసింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల మనోభావాలను గాయపరచేందుకు ఉద్దేశించిన వీడియోగా బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.


ప్రజలే గుణపాఠం చెబుతారు: అసోం సీఎం

ఈ పరిణామంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి తల్లిని కాంగ్రెస్ అవమానపరచడం గర్హనీయమని అన్నారు. ప్రధాని తల్లి అందరికీ తల్లి అని, ఆమెను అవమానపరిచిన కాంగ్రెస్‌కు బిహార్ ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారని అన్నారు. రాజకీయాల్లో సరికొత్త దిగజారుడుగా కాంగ్రెస్ చర్యను బీజేపీ ఎంపీ రాధాకృష్ణ మోహన్ దాస్ పేర్కొన్నారు. ప్రధాని ఎప్పుడూ కుటుంబ జీవితాన్ని, రాజకీయాలను వేరుగా చూస్తారని, ప్రధాన మంత్రి తల్లిని ఇంతకు ముందు అవమానపరిచిన కాంగ్రెస్ ఇప్పుడు డీప్‌ఫేక్ టెక్నాలజీతో దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని, ఇది తల్లులందరికీ అవమానకరమని అన్నారు. బిహార్ కాంగ్రెస్ ఏఐ వీడియోపై బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. ఈ వీడియోతో ఆ పార్టీ అన్ని హద్దులు అతిక్రమించిందని అన్నారు. గాంధేయవాదానికి బదులు గాలిమాటలకు కాంగ్రెస్ పరిమితమైందని అన్నారు. నారీ శక్తిని అవమానించడానికి కాంగ్రెస్ కంకణం కట్టుకుందా? అని బీజేపీ జాతీయ ప్రతినిధి సీఆర్ కేశవన్ నిలదీశారు. కాంగ్రెస్ చర్య క్షమార్హం కాదన్నారు.


ఇవి కూడా చదవండి..

సుప్రీంలో నటి కంగనాకు బిగ్ షాక్

రేపటి నుంచి విజయ్‌ యాత్ర..

For More National News and Telugu News

Updated Date - Sep 12 , 2025 | 03:39 PM