Home » Bhanu Koganti
తెలంగాణ పోరాటయోధుడు, విప్లవ వీరుడు సర్వాయి పాపన్న. అంతటి గొప్ప వ్యక్తికి ఇప్పటివరకు స్పష్టమైన జనన, మరణ తేదీలు లేకపోవడమనేది చారిత్రక ఆధారాల కొరత, మౌఖిక సంప్రదాయం ఆధిపత్యం, అధికారిక నిర్లక్ష్యం వంటి కారణాలనేకం. అయితే.. ఆ యోధుడికి సంబంధించిన జయంతి, వర్ధంతుల అధికారిక తేదీలు 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' కథనం ద్వారా బహిర్గతమయ్యాయి. వివరాల్లోకెళితే...
తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయం. అయితే, ఆ ప్రోత్సాహం కేవలం నిధుల రూపంలోనే కాకుండా.. క్రీడాకారులు ఆడే మైదానాలను కూడా గౌరవించేలా ఉండాలి.
సెల్ఫోన్.. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకూ ప్రతిఒక్కరి జీవితంలో ఇది భాగమైపోయింది. ముఖ్యంగా చిన్నపిల్లలు దీనికి బానిసలుగా మారతున్నారని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మనకు మనమే క్రమంగా పరిమితులు విధించుకోవాలని ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి సూచించారు.
బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వద్ద మానసిక రోగిని జీహెచ్ఎంసీ సిబ్బంది బేగంపేట షెల్డర్ హోమ్కు తరలించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్వీట్కు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ స్పందించారు.
ఏపీలో శనగ రైతులు పడుతోన్న ఇబ్బందుల మీద ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనానికి అధికార యంత్రాంగం స్పందిస్తోంది. బాపట్ల జిల్లా మార్క్ఫెడ్ మేనేజర్ కరుణశ్రీ ఈ అంశంపై తీసుకుంటోన్న చర్యల గురించి వివరించారు.
హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ సమీపంలో ఓ మానసిక రోగి పడుతున్న ఇబ్బందిపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్' భానుప్రకాశ్ కోగంటి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్కు జోనల్ కమిషనర్ స్పందించారు.
మతం మారిన వారి ఎస్సీ హోదాకు సంబంధించి సుప్రీం కోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ (SC) హోదా వర్తించదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
మార్చి 22న అంతర్జాతీయ నీటి దినోత్సవం. ప్రస్తుతం.. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న నీటి కొరత, వాతావారణ పరిస్థితులు, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు నీటిపై ఏవిధంగా ప్రభావం చూపుతాయనే విషయాలపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ప్రముఖులతో ప్రత్యేక ముఖాముఖి నిర్వహించారు. ఆ వివరాలు ఈ వీడియోలో మీకోసం...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ పూర్ణ భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. శుక్రవారం పటమట లంక నుంచి శ్మశానవాటిక వరకు ఊరేగింపుగా అంతిమయాత్ర నిర్వహించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్.. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భానుప్రకాశ్కు ఇచ్చిన ముఖాముఖిలో పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల పేరు చెప్పి అమెరికా ఒక దేశం తర్వాత మరో దేశంపై దాడి చేస్తూ వస్తోందని, ప్రజల కోసమంటూ విధ్వంసం సృష్టిస్తోందని యోగేంద్ర యాదవ్ మండిపడ్డారు.