ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ప్రముఖలతో 'ఏబీఎన్ డైరెక్టర్' ప్రత్యేక ఇంటర్వూ
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:30 PM
మార్చి 22న అంతర్జాతీయ నీటి దినోత్సవం. ప్రస్తుతం.. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న నీటి కొరత, వాతావారణ పరిస్థితులు, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు నీటిపై ఏవిధంగా ప్రభావం చూపుతాయనే విషయాలపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ప్రముఖులతో ప్రత్యేక ముఖాముఖి నిర్వహించారు. ఆ వివరాలు ఈ వీడియోలో మీకోసం...
ఇంటర్నెట్ డెస్క్: ఏటా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా నీటి దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. 1993లో ఐక్యరాజ్యసమితి(UNO) దీనిని ప్రారంభించింది. నీటి కొరతను అధిగమించడం, సురక్షితమైన నీటిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి.. లేబర్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మాజీ సభ్యులు బొల్లిముంత సాంబశివరావు, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, బీహెచ్యూ హెచ్ఓడీ కృపారామ్లతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు.
'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ఇంటర్వూ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నీటి కొరత, వాతావరణ పరిస్థితులు, ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో వాతావరణంలో సంభవించిన మార్పులపై భానుప్రకాశ్ ప్రత్యేక ప్రశ్నలు అడుగగా.. సాంబశివరావు, కృపారామ్లు వివరణ ఇచ్చారు. జీవకోటి మనుగడకు గాలి తర్వాత నీరే అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. మానవ శరీరంలో దాదాపు 60 శాతం నుంచి 70 శాతం వరకు నీరే ఉంటుందని చెప్పుకొచ్చారు. మనం తినే ప్రతి గింజ పండాలన్నా, పాడి పరిశ్రమ వర్ధిల్లాలన్నా నీరు తప్పనిసరని వెల్లడించారు. నీటి కొరత నేరుగా ఆహార సంక్షోభానికి దారితీస్తుందని వారు పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
'మీరు శాంతిని కోరుకుంటే.. కూర్చుని మాట్లాడుకుంటే చాలు'
AI Vs ARపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ ప్రత్యేక విశ్లేషణ