Home » Bhanu Koganti
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరతపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు నిజంగానే తగ్గిపోయాయా? లేక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్.. ఎక్స్ వేదికగా స్పందించారు.
అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి ఎదగాలనే ఆకాంక్ష ఒకవైపు.. కనీస వ్యర్థాల నిర్వహణ లేక విషతుల్యమవుతున్న నగరాలు మరోవైపు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చెత్త నిర్వహణ పెను ముప్పుగా పరిణమించిందిని 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి అన్నారు.
'చర్చలు' శక్తివంతమైన ఆయుధం. సమస్య ఎంత జటిలమైనా, పట్టింపులకు పోకుండా ఇరువర్గాలు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది. ప్రస్తుత తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఈ అంశంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్.. ఎక్స్ వేదికగా స్పందించారు.
నేడు 'ప్రపంచ సృజనాత్మకత, ఆవిష్కరణల దినోత్సవం'. ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కృతమైన అద్భుతాలకు తగిన గుర్తింపు ఇస్తున్న సమయమన్నమాట. నేడు 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ కోవలో ముందుంటారు.
విజయవాడ బీసెంట్ రోడ్డులో చిరు వ్యాపారిగా జీవనం సాగిస్తున్న దుర్గారావు సమస్యను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి ట్వీట్ చేయడంతో మంత్రి నారా లోకేశ్ దృష్టికి చేరింది. ఆ ట్వీట్ ఆయన మనసును కదిలించింది.
దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, ఎంపీ సీట్ల పెంపుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో.. ఒక సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. ఎంపీల సంఖ్య పెంచడం కంటే, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువగా ఉండే రాష్ట్రాల ఎమ్మెల్యేల సంఖ్యను పెంచితే సరిపోతుంది కదా? అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పింఛన్ ఇప్పించే ఏర్పాటు చేస్తానంటూ స్వయంగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినా.. ఇప్పటికీ నెరవేరలేదంటూ దుర్గారావు అనే దివ్వాంగుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు.
'రేవతి'. ఈమె ఒక సామాన్య కానిస్టేబుల్. కానీ వ్యవస్థలో తప్పు జరిగినప్పుడు ఏమాత్రం తడబడకుండా, దేనికీ భయపడకుండా నిలిచి చరిత్ర సృష్టించారు. 'జస్టిస్ వర్మ'. ఈయన వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి. ఢిల్లీ కరెన్సీ నోట్ల కట్ల కేసులో తన బాధ్యతను గుర్తించడానికి లేదా రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి ఆపసోపాలుపడ్డారు.
రాజకీయాల్లో వ్యూహం కంటే ప్రతివ్యూహం ముఖ్యం. ఒక్కోసారి ప్రత్యర్థి వేసే ఎత్తుగడలు ఎంత వింతగా ఉంటాయంటే.. అందులో ఉన్న లాజిక్ను పట్టుకోవడానికి రాజకీయ పండితులకు కూడా సమయం పడుతుంది. 'మావిగన్' వ్యవహారం దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్..
గచ్చిబౌలిలోని జీఎంసీ. బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ను రూ.700 కోట్ల భారీ వ్యయంతో ఆధునీకరించాలని సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయించడం శుభపరిణామం. అయితే.. ఇంతటి భారీ ప్రాజెక్టును చేపట్టే ముందు పారదర్శకత, ప్రజాధనం వృథా కాకుండా చూసుకోవడం ఆవశ్యకం.