Home » Bengaluru
ఓ భార్యాభర్తల జంట క్రూరత్వం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. కారు సైడ్ మిర్రర్ విరగ్గొట్టారన్న కోపంతో ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న బైకును ఆ దంపతులు తమ కారుతో ఢీకొట్టారు. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు.
రాష్ట్రంలో నవంబరు క్రాంతి జరుగుతుందని, లాబీ చేసేవారికి పదవి లభించదని, మల్లికార్జునఖర్గే ముఖ్యమంత్రి అవుతారని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ అన్నారు. గురువారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్లో సీఎం పదవికోసం కుస్తీ ప్రారంభమైందన్నారు.
టన్నెల్ ప్రాజెక్టు రాజధాని ట్రాఫిక్ కష్టాలను తీరుస్తుందని డీకే చెబుతుండగా, ఆ ప్రాజెక్టును రద్దు చేసి ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కొన్ని ప్రతిపాదనలను తేజస్వి సూర్య డిప్యూటీ సీఎం ముందుంచారు. డీకేను స్వయంగా ఆయన కలిశారు.
ఆ వ్యక్తి చెప్పులు వేసుకుని గుడిలోకి ప్రవేశించాడు. దేవుడి విగ్రహంపై కూడా దాడి చేశాడు. అక్కడే ఉన్న భక్తులు ఈ చర్యతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ వెంటనే తేరుకుని అతడ్ని పట్టుకున్నారు.
మైసూరు, చామరాజనగర జిల్లాల్లో పులుల దాడుల్లో ఆదివారం ఒకే రోజున ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటనలతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవలి కొంతకాలంగా రెండు జిల్లాల పరిధిలో పలు గ్రామాల్లో పులుల దాడితో పశువులు, గొర్రెలను రైతులు కోల్పోయారు.
కన్నడ నటి దివ్య సురేశ్ పై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఈమె కన్నడ బిగ్ బాస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బైతరాయణపురలోని ఎంఎం రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది.
కొద్ది రోజులుగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై కిరణ్ మజుందార్, డీకే శివకుమార్ మధ్య మాటల యుద్ధం సాగుతూ వచ్చింది. బెంగళూరు రోడ్లు, చెత్తతో తాను ఇబ్బందులు పడినట్టు ఒక విదేశీ విజిటర్ చేసిన వ్యాఖ్యలపై మజుందార్ స్పందించడం చర్చనీయాంశమైంది.
ఎలక్ట్రిక్ బైక్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ బెంగళూరు ఆఫీస్లో షాకింగ్ ఘటన జరిగింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ఓ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు 28 పేజీల మరణ వాంగ్మూలం రాశాడు. దీంతో ఓలా సంస్థ సీఈవో భవీశ్ అగర్వాల్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
చెత్త కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని, దేశలోని ప్రధాన నగరాల్లోని ఏ మున్సిపాలిటీ దీనిని పరిష్కరించడం లేదని, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఈ చెత్త సమస్య దయనీయంగా ఉందని మజుందార్ ఇటీవల ట్వీట్ చేశారు.
కర్ణాటక వెనుకబడి తరగతుల కమిషన్ చేపట్టిన 'సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వే'లో పాల్గొన రాదని నారాయణ మూర్తి దంపతులు నిర్ణయం తీసుకున్నారు. ఎన్యూమరేషన్ కోసం ఆ దంపతుల ఇంటికి వెళ్లినప్పుడు తమకు సర్వే అక్కర్లేదని చెప్పినట్టు అధికారులు తెలిపారు.