Home » BCCI
బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బీసీసీఐ ఆదేశాల మేరకు అతడిని కేకేఆర్ జట్టు ఐపీఎల్ నుంచి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముస్తాఫిజుర్ పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆడనున్నాడు.
బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత పరిస్థితులన్నీ గందరగోళంగా మారాయి. టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత్కు తమ జట్టును పంపడానికి కుదరని బంగ్లా క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఐసీసీకి లేఖ రాసింది.
టీమిండియా టీ20, వన్డే ఫార్మాట్లతో పోలిస్తే టెస్టుల్లో దారుణంగా విఫలమవుతూ వస్తుంది. ఇప్పుడు 2026లో పుంజుకుని 2027 వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక సూచనతో ముందుకు వచ్చాడు.
న్యూజిలాండ్తో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. దీనికి సంబంధించిన జట్టులో సీనియర్ పేసర్ షమీని ఎంపిక చేయలేదు. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్రంగా స్పందించాడు.
బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్లో నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ముస్తాఫిజూర్ను ఐపీఎల్ నుంచి తప్పించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. చివరకు బీసీసీఐ సూచనలతో కేకేఆర్ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. ఈ విషయంపై బంగ్లాదేశ్ తీవ్రంగా స్పందిస్తోంది.
బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి తప్పించాలని కేకేఆర్కు బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు.
ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ను కేకేఆర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్తో బంగ్లా ఆడే మ్యాచుల వేదికలు మార్చాలని ఐసీసీని సంప్రదిస్తున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్ను బీసీసీఐ ఆదేశించింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్ను ఐపీఎల్లో ఆడించొద్దని డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే.
టీమిండియా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ తీవ్రంగా గాయపడ్డాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచులో రన్ తీస్తూ కింద పడ్డాడు. దీంతో అతడి పక్కటెముక విరిగినట్టు తెలుస్తోంది.
ఐపీఎల్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఎట్టకేలకు బీసీసీఐ వర్గాలు స్పందించాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడకుండా నిరోధించడంపై తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గనిర్దేశకాలు రాలేదని పేర్కొన్నాయి.