Home » BCCI
టీ20 ప్రపంచ కప్2026 వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టోర్నీలకు భారత ఆటగాళ్లతో కుటుంబాలను అనుమతించకూడదన్న నిబంధనకు కట్టుబడి ఉండాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అండర్-19 ప్రపంచ కప్ 2026లో విశ్వ విజేతగా నిలిచిన యువ భారత్కు బీసీసీఐ రూ.7.50 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు.
భారత అభిమానులకు గుడ్ న్యూస్. సర్జరీ కారణంగా టీ20 జట్టుకు దూరమైన స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. తాజాగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో మ్యాచ్ ఫిట్నెస్ టెస్ట్ పాసయ్యాడు.
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 విషయంలో బంగ్లాను పాక్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ బంగ్లాను రెచ్చగొడుతోందని.. ఇది పద్ధతి కాదని ఆయన వెల్లడించారు.
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ బింద్రా ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన 1993 నుంచి 1996 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అలాగే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్కు 1978 నుంచి 2014 వరకు ప్రెసిడెంట్గా ఉన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. ఈ టోర్నీలో ఎక్కువ శాతం మ్యాచులు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగానే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ, బీసీసీఐకి చెందిన ఉమ్మడి తనిఖీ బృందం గురువారం ఈడెన్ గార్డెన్స్ను సందర్శించింది.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒకే ఫార్మాట్ ఆడుతున్న కారణంగా వారిని ఏ ప్లస్ కేటగిరీ నుంచి ‘బీ గ్రేడ్’కు డిమోట్ చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల సమాచారం..
ఆదివారం వడోదర వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ అంపైర్ సర్ఫుద్దౌలా సైకత్ విధులు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. ఈ విషయంపై బీసీబీ తాజాగా స్పందించింది. అతడికి బీసీబీకి సంబంధం లేదని తేల్చి చెప్పింది.
భద్రత కారణాల దృష్ట్యా రానున్న టీ20 ప్రపంచ కప్లో భారత్లో బంగ్లా ఆడనున్న మ్యాచ్ల వేదికలు మార్చాలంటూ బీసీబీ.. ఐసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. బీసీబీ అభ్యర్థనను ఐసీసీ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఈ అంశంపై ఐసీసీ.. బంగ్లా క్రికెట్ బోర్డుకు ఓ కీలక సూచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ అసలు టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా? లేదా? అనే విషయంలో ఓ క్లారిటీ అంటూ లేదు. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెట్ జట్టు సభ్యుడు, స్టార్ ఆల్రౌండర్ మహేదీ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.