Home » BCCI
అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలంటే దేశవాళీల్లో ఆడాల్సిందేనని సెలక్షన్ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడబోనని చెప్పినట్లు సమాచారం.
టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ త్వరలో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. 2027 ప్రపంచకప్ విషయంలో వారి నుంచి స్పష్టత తీసుకోవడం, జట్టు వారి నుంచి ఏం ఆశిస్తోందో చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్ వాష్కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. గంభీర్కు బీసీసీఐ మద్దుతుగా నిలిచింది.
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ 2026 జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా మంగళవారం రిలీజ్ అయింది. ఈ టోర్నీలో భాగంగా భారత్ లో ఐదు వేదికల్లో మ్యాచులు జరగనున్నాయి. ఈ వేదికల ఎంపిక విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్కు బుమ్రా, హార్దిక్ పాండ్యలకు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
సౌతాఫ్రికాతో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్ చేరాడు. తీవ్రమైన మెడ నొప్పి కారణంగా అతడిని ఆసుపత్రిలో చేర్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. కాగా ఈ టెస్ట్లో గిల్ ఆడటం కష్టమమే అని సమాచారం.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల్లో కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో వీరిద్దరూ త్వరలోనే జరగనున్న విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనే అవకాశం ఉంది.
శనివారం నాడు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడారు. ఐసీసీ సమావేశానికి పీసీబీ ఛైర్మన్ నఖ్వీ కూడా హాజరయ్యారని, అజెండాలో లేనప్పటికీ తాను, నఖ్వీ.. ఐసీసీ అధికారుల సమక్షంలో భేటీ అయ్యామని సైకియా అన్నారు. చర్చల ప్రక్రియ ప్రారంభం కావడం బాగుందని, ఇరు పక్షాలూ ఈ సమావేశంలో సహృదయంతో పాల్గొన్నాయని తెలిపారు.
చిరస్మరణీయ విజయం సాధించిన భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీ ఉంటుందని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ వారిని బీసీసీఐ నిరాశకు గురి చేసింది. ఆదివారం కప్ గెలిస్తే... ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి విజయోత్సవ వేడుకలు నిర్వహించలేదు.
శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంగానే ఉన్నాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. వైద్యులు అనుకున్న దాని కంటే వేగంగా కోలుకుంటున్నట్లు చెప్పారు. శ్రేయస్ ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని.. భిన్నమైన వైద్య ప్రక్రియతో అంతర్గత రక్తస్రావం జరగకుండా వైద్యులు చూశారని తెలిపారు.