Home » Bangladesh
బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులపై వరుసగా జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. హిందువుల ఇళ్లపై, వ్యాపార సంస్థలపై కొంతమంది అతివాదులు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటికే పలువురు హిందువులు చనిపోయారు.
బంగ్లాదేశ్-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ అసలు టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా? లేదా? అనే విషయంలో ఓ క్లారిటీ అంటూ లేదు. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెట్ జట్టు సభ్యుడు, స్టార్ ఆల్రౌండర్ మహేదీ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
బంగ్లా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్పై బీసీబీ సభ్యుడు నజ్ముల్ ఇస్లామ్ సంచలన ఆరోపణలు చేశాడు. సోషల్ మీడియా వేదికగా ‘ఇండియన్ ఏజెంట్’ అని నిందించాడు. ఐసీసీ నుంచే 95 శాతం వరకు బంగ్లా క్రికెట్కు నిధులు వస్తాయని.. బీసీబీ జాగ్రత్తగా వ్యవహరించాలని తమీమ్ సూచించిన విషయం తెలిసిందే.
భారత్తో శత్రుత్వం పాటిస్తున్న పొరుగుదేశం బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్థాన్కు చేరువ అవుతోంది. షేక్ హసీనా పాలన ముగిసిన తర్వాత బంగ్లా అనేక రంగాల్లో పాక్తో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి.
భద్రతా కారణాల దృష్ట్యా భారత్ లో జరిగే తమ మ్యాచులను మరో చోటుకు తరలించాలంటూ ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తమ లేఖకు ఐసీసీ సానుకూలంగా స్పందించిందంటూ తాజాగా బీసీబీ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. కానీ...
భారత్-బంగ్లాదేశ్ నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్కు (BPL) ప్రెజెంటర్గా వ్యవహరిస్తున్న భారత్కు చెందిన రిధిమా పాఠక్ను హోస్టింగ్ ప్యానల్ నుంచి తొలగిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా రిధిమా స్పందించారు. ఆ వార్తలను ఖండించారు.
భారత్తో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ ప్రసారాలను బ్యాన్ చేయాలంటూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తమ దేశానికి చెందిన అంపైర్ల విషయంలో కూడా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత పరిస్థితులన్నీ గందరగోళంగా మారాయి. టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత్కు తమ జట్టును పంపడానికి కుదరని బంగ్లా క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఐసీసీకి లేఖ రాసింది.
డిసెంబర్ నెలలో ఏకంగా నలుగురు హిందువులు బంగ్లాదేశ్లో హత్యకు గురయ్యారు. దీపు చంద్రదాస్తో అలజడి మొదలైంది. డిసెంబర్ 31వ తేదీన ఖోకోన్ చంద్రదాస్కు ఓ గ్యాంగ్ దాడి చేసింది. పెట్రోల్ పోసి నిప్పంటించింది.
ప్రత్యక్ష సాక్షులు, పోలీసు వర్గాల సమాచారం ప్రకారం మార్కెట్కు వచ్చిన రాణాప్రతాప్పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.