Home » Bandi Sanjay
తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చానని ప్రధాని మోదీ తెలిపారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. మూడో దశ ఎన్నికల్లో ఇండియా కూటమి మూడో ఫ్యూజ్ పోయిందన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో వేగంగా ముందుకు వెళ్తోందన్నారు. మిగిలిన 4 విడతల్లోనూ బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను.. గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారన్నారు.
బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ యూత్ ఐకాన్ అని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై ప్రశంసించారు. ప్రధాని మోదీ మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. సంజయ్ పోరాటాలు ఆదర్శంగా నిలిచాయని,
తెలంగాణలో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. బీజేపీ అగ్ర నేతలంతా రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. నేడు మూడు బహిరంగ సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు పెద్దపల్లి, ఒంటి గంటకు భువనగిరి, మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండ బీజేపీ అభ్యర్థి మద్దతుగా నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మతో పాటు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు..
తెలంగాణలో కాంగ్రెస్ (Congress) పాలన చివరి దాకా ఉండేలా లేదని... మధ్యలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ ట్యాపింగ్ కేసులో కరీంగనర్కు చెందిన ఓ మంత్రి కాపాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఆ మంత్రి చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు.
ను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల సంగతి ఏమైందని అడిగితే.. గుండు, అరగుండు అంటూ హేళనగా మాట్లాడుతావా?
రాముడి పేరు చెప్పి బీజేపీ (BJP) ఓట్లు అడుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణకు మోదీ గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. సీతారాముల కళ్యాణం చేసిన తర్వాత అక్షింతలు ఇస్తామని.. కానీ కల్యాణం జరగకముందే బీజేపీ నేతలు ఇక్కడ అక్షింతలు పంచారని చెప్పారు. రాముడిని బీజేపీ అవమానించిందని మండిపడ్డారు.
తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజుకుంటోంది. ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ అని.. ఆయనకు ఒకప్పుడు వేసుకునేందుకు బట్టలు కూడా ఉండేవి కావని ఎద్దేవా చేశారు. తనను గాలి తిరుగుడు అనడంపై బండి సంజయ్ మండిపడ్డారు
సిద్దిపేట జిల్లా: కోహెడలోని వెంకటేశ్వర గార్డెన్లో ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఆరుగురు బీఆర్ఎస్ మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. నాలుగు నెలల తమ పాలనలో ఆరు గ్యారంటీలలో చేయాల్సినవి అమలు చేశామని స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లా: బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పేరుకు మాత్రమే ఇద్దరు.. కేసీఆర్ అనే నాణానికి వారిద్దరూ బొమ్మ బొరుసులాంటివారని కరీంనగర్ జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ విమర్శించారు.