Home » Australia
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ సిడ్నీ వేదికగా ఐదో టెస్టులో తలపడుతున్నాయి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 75 ఓవర్లు ఆడి 8 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఆసీస్పై 119 పరుగుల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. జాకబ్ బెథెల్(142*) అద్భుత సెంచరీతో అజేయంగా నిలిచాడు.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ సిడ్నీ వేదికగా ఐదో టెస్టులో తలపడుతున్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ జట్టు.. 7 వికెట్లు కోల్పోయి 518 పరుగుల భారీ స్కోరు చేసింది. 166/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ప్రస్తుతం ఇంగ్లండ్పై కంగూరులు 134 పరుగుల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డేమియన్ మార్టిన్ ఆరోగ్య విషయంలో అద్భుతం జరిగింది. కొంతకాలంగా కోమాలో ఉన్న ఆయన ఆశ్చర్యకర రీతిలో సాధారణ స్థితికి వచ్చారు. ఇటీవల ఆయన మెనినైటిస్తో బాధపడుతూ కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
యాషెస్ సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ ఐదో టెస్టు ఆడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 211/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 384 పరుగులకు ఆలౌటైంది.
ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిడ్నీ వేదికగా జరుగుతున్న యాషెస్ చివరి టెస్టే.. అతనకు చివరి మ్యాచ్. అయితే ఆ మ్యాచ్ ప్రారంభానకిి ముందు తన తల్లిదండ్రుల గురించి ప్రస్తావిస్తూ ఎమోషనలయ్యాడు.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. జోరు మీదున్న ఇంగ్లండ్కు వరుణుడు ఆటంకం కలిగించాడు. చాలా సేపు వేచి చూసినా వరుణుడు కనికరించకపోవడంతో తొలి రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరగుతోంది. ఈ మ్యాచులో ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఓ చారిత్రక నిర్ణయం తీసుకున్నాడు. దీంతో 138 ఏళ్ల రికార్డుకు బ్రేక్ పడింది.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఆదివారం సిడ్నీ వేదికగా ఐదో టెస్టు ప్రారంభం కానుంది. ఇటీవలే బోండీ బీచ్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిడ్నీ మైదానం లోపల, వెలుపల భద్రత కట్టుదిట్టం చేశారు.
ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్లో భాగంగా సిడ్నీలో జరిగే టెస్టే తనకు ఆఖరు మ్యాచ్ కానుందని వెల్లడించాడు. ఖవాజా తన కెరీర్లో ఇప్పటివరకు 87 టెస్ట్లు, 40 వన్డేలు, 9 టీ20లు ఆడాడు.
టీ20 వరల్డ్ కప్ -2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ టోర్నీని భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో ఆయా దేశాలు టీ20 వరల్డ్ కప్ ఆడే తమ జట్టును ప్రకటిస్తున్నాయి. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు కూడా తమ జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ సారథ్యంలో.. 15 మంది సభ్యులతో కూడిన తమ బృందాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.