• Home » Assembly elections

Assembly elections

ఏఐ వీడియోలతో అప్రమత్తంగా ఉండాలి.. అస్సాం కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం

ఏఐ వీడియోలతో అప్రమత్తంగా ఉండాలి.. అస్సాం కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం

క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టాలని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు.

నామినేషన్ వేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్

నామినేషన్ వేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంటోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సోమవారంనాడు తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన కొలతూర్ నియోజకవర్గంలో రోడ్‌షోలో పాల్గొన్నారు.

బెంగాల్‌లో 284 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. బహ్రాంపుర్ నుంచి అధీర్ రంజన్

బెంగాల్‌లో 284 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. బహ్రాంపుర్ నుంచి అధీర్ రంజన్

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 284 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఆదివారంనాడు ప్రకటించింది. బహ్రాంపుర్ అసెంబ్లీ నియోజకవర్గ నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి పోటీ చేస్తున్నారు.

రైతన్నలకు సాయం, మహిళలకు నెలవారీ గ్రాంట్.. డీఎంకే మేనిఫెస్టో

రైతన్నలకు సాయం, మహిళలకు నెలవారీ గ్రాంట్.. డీఎంకే మేనిఫెస్టో

సంక్షేమ పథకాల అమలులో తమిళనాడు అన్ని రాష్ట్రాల కంటే మందుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. రైతులు, మహిళలు, యువతతో సహా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను మరింత విస్తరించనున్నట్టు తెలిపారు.

కాంగ్రెస్ 5 గ్యారంటీలు ప్రకటించిన ఖర్గే

కాంగ్రెస్ 5 గ్యారంటీలు ప్రకటించిన ఖర్గే

అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలవారీ నగదు బదిలీతో పాటు, వారు వ్యాపారం చేసుకునేందుకు, వ్యాపార విస్తరణకు అదనంగా రూ.50,000 సాయం చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.

వాళ్లు వచ్చారో మీరు మాంసం కూడా తినలేరు: మమతా బెనర్జీ

వాళ్లు వచ్చారో మీరు మాంసం కూడా తినలేరు: మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలు కనీసం మాంసం, గుడ్లు తినే పరిస్థితి కూడా ఉండదని అన్నారు.

ఎల్డీఎఫ్, యూడీఎఫ్ దోపిడీ నుంచి మార్పును కోరుతున్న ప్రజలు: మోదీ

ఎల్డీఎఫ్, యూడీఎఫ్ దోపిడీ నుంచి మార్పును కోరుతున్న ప్రజలు: మోదీ

కేరళలో కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల మధ్య సంబంధాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. రెండు పార్టీలు పరస్పర ప్రత్యర్థులుగా కనిపిస్తూ, వంతులవారిగా రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని విమర్శించారు.

అన్నాడీఎంకే స్థానాన్ని ఆక్రమించుకోనున్న విజయ్ టీవీకే

అన్నాడీఎంకే స్థానాన్ని ఆక్రమించుకోనున్న విజయ్ టీవీకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే స్థానాన్ని తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం భర్తీ చేయనుందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ జోస్యం చెప్పారు.

డీఎంకే జాబితా విడుదల.. కొలతూర్ నుంచి సీఎం స్టాలిన్ పోటీ

డీఎంకే జాబితా విడుదల.. కొలతూర్ నుంచి సీఎం స్టాలిన్ పోటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 164 మంది అభ్యర్థుల జాబితాను డీఎంకే శనివారంనాడు విడుదల చేసింది. ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మరోసారి కొలతూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

3న చెన్నైకి ప్రధాని మోదీ?

3న చెన్నైకి ప్రధాని మోదీ?

భారత ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్‌ 3న చెన్నై రానున్నట్లు తెలిసింది. ఆ రోజు పుదుచ్చేరి ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న మోదీని చెన్నైకికూడా రప్పించాలని ఎన్‌డీఏ నేతలు సన్నాహాలు చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి