Home » Assembly elections
ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా కొందరు నిబంధనలను దర్జాగా ఉల్లంఘించేస్తున్నారు. నేతలే కాకుండా వాలంటీర్లు సైతం డోంట్ కేర్ అంటుండడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
లోక్సభ ఎన్నికల ప్రకటనతో దేశవ్యాప్తంగా రాజకీయ సందడి మొదలైంది. అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ బిజీగా మారింది. ఈ క్రమంలో ఇవాళ జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం అనంతరం పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
‘ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాకు అవకాశం ఇవ్వాల్సిందే’ అంటూ బీజేపీలో పలువురు నేతలు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. టీడీపీ, జనసేనతో పొత్తు కుదరడంతో గెలుపుపై ధీమా పెరిగి.. బీజేపీలో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్యా పెరుగుతోంది. ఏ సీటు ఖరారైందో అంతర్గతంగా
ఏపీ అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా పూర్తి వివరాలు వెల్లడించారు. నాలుగో దశలో ఏపీలో ఎన్నికలు జరుతాయని తెలిపారు.
దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. లోక్ సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం, జమ్ముకశ్మీర్ అసెంబ్లీలకు సైతం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాయి.
సాధారణంగా మన దేశంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విడివిడిగా ఎన్నికలు జరుగుతుంటాయి. పార్లమెంట్ కు ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగితే రాష్ట్రాల అసెంబ్లీలకూ ప్రతి ఐదేళ్లకు ఓ సారి ఎలక్షన్లు జరుగుతాయి. అయితే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగవు.
వైసీపీ రాక్షస పాలనను తరిమి కొట్టాలంటే పొత్తులు తప్పదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారని ఆ పార్టీ నేత అమ్మిశెట్టి వాసు అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని జనసేన కార్యాలయంలో శనివారం జరిగిన జనసేన నేతలు, కార్యకర్తల సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అమ్మిశెట్టి వాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ...
అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై మూడు రోజుల్లో స్పష్టమైన ప్రకటన వస్తుందని బీజేపీ నేత సీఎం రమేష్ నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలపై చర్చ జరిగిందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలనే ఉద్దేశంతో కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులతో చంద్రబాబు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా అధికారుల బదిలీలపై భారత ఎన్నికల సంఘం (ECI) ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిబంధనల్లో భాగంగా...