Home » Assembly elections
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ తెలంగాణ పూర్వవైభవం రావాలన్న ఆశతో ఉన్నారని గుర్తు చేశారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు.
అహ్లాదకరమైన వాతావరణంలో సమావేశం జరిగిందని, సీట్ల పంపకాలపై భాగస్వామ్య పార్టీలు ఒక విస్తృత అవగాహనకు వచ్చాయని సమావేశానంతరం బిహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ రామ్ తెలిపారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిస్తేతనను సీఎం పదవిలో కూర్చోబెడతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ముందే చెప్పారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో జూలై 7వ తేదీ ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్ర శుక్రవారం తేని జిల్లా కంబం నియోజకవర్గం చేరుకుంది.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ ఈ నెల 13 నుంచి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఆ మేరకు తిరుచ్చి నగరంలో ఆయన ప్రచారం ప్రారంభించనున్నారని పార్టీ నేతలు తెలిపారు. విజయ్ పర్యటన కోసం సకల సదుపాయాలతో ఓ లగ్జరీ బస్సు పయనూరులోని ఆయన నివాసం వద్ద సిద్ధంగా ఉందని చెప్పారు.
విద్వేష ప్రసంగాలతో సమాజంలోని మైనారిటీ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Dy CM Udayanidhi) ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిప్లికేన్లోని కలైవానర్ అరంగంలో రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
తమిళనాడు బీజేపీలో అంతర్గత కలహాలకు చెక్ పెట్టి కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్షా రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరించేందుకు అమిత్షాతో రాష్ట్ర బీజేపీ నేతలు న్యూఢిల్లీలో బుధవారం భేటీ అయ్యారు.
కేంద్రప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను డీఎంకే ప్రభుత్వం నీరుగారుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
బిహార్లో ఎన్డీయే భాగస్వాములుగా BJP, నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యునైటెడ్ (JD-U), చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), జితిన్ రామ్ మాంఝీ హిందుస్తాని అవావీ మోర్చా (సెక్యులర్), ఉపేంద్ర కుష్వాహకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్డీ) ఉన్నాయి.
‘మక్కళై కాప్పోమ్...తమిళగత్తై మీడ్పోమ్’ (ప్రజలను కాపాడుదాం... రాష్ట్రానికి విముక్తి కల్పిద్దాం...!) పేరుతో తాను చేపట్టిన పర్యటన వంద నియోజకవర్గాల్లో విజయవంతంగా పూర్తయిందని, అన్ని చోట్లా మహిళలు, యువత తనకు ఘనస్వాగతం పలుకుతున్నారని, వీరి స్పందన చూస్తుంటే శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామనే నమ్మకం కలుగుతోందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నారు.
ఐకమత్యంతో కూడిన బలమైన అన్నాడీఎంకేను ప్రజలు కోరుకుంటున్నారని, అందువల్ల ప్రతి నేతా, కార్యకర్తా ఏకతాటిపైకి రావాలని ఆ పార్టీ బహష్కిృత నాయకురాలు శశికళ(Shashikala) పిలుపునిచ్చారు. ఇదే విషయంపై ఆమె శనివారం ప్రకటన విడుదల చేశారు.