Home » Assembly elections
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమి తుడిచిపెట్టుకుపోతుందన్న భయంతో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ నోరు తిరగని పేర్లతో కొత్త పథకాలను ప్రారంభిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ధ్వజమెత్తారు.
పదేళ్ల అన్నాడీఎంకే పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అథఃపాతాళానికి చేరిందని, గత నాలుగేళ్ల డీఎంకే ద్రావిడ తరహా పాలనలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి పురోగమించినట్లు కేంద్రప్రభుత్వమే ప్రకటించిందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
‘సినీ, రాజకీయ రంగాల్లో రికార్డులు సాధించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన రోల్ మోడల్’ అని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత పేర్కొన్నారు. జీసీసీ ప్రధాన కార్యాలయం రిప్పన్ భవనం సమీపంలో తమ హక్కుల కోసం సమ్మె చేస్తున్న పారిశుధ్య కార్మికులకు మద్దతు ప్రకటించిన ప్రేమలత, సోమవారం వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి స్టాలిన్ గురించి తమకు బాగా తెలుసని అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఎద్దేవా చేశారు. డీఎంకే పాలనలో అన్ని రంగాల్లో కుంటుపడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి తెచ్చిన పెట్టుబడుల వ్యవహారాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ చెప్పేవన్నీ అసత్యాలేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలన్నీ డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్నట్లుగా స్టిక్కర్లు వేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, నటి ఖుష్బూ ఆరోపించారు.
వికాస్ వంచిత్ ఇన్సాన్ పార్టీ (వీవీఐపీ), భోజ్పురియ జన్ మోర్చా (బీజేఎం), ప్రగతిశీల్ జనతా పార్టీ (పీజేపీ), వజిబ్ అధికార్ పార్టీ (డబ్ల్యూఏపీ), సంయుక్త్ కిసాన్ వికాస్ పార్టీ (ఎస్కేవీపీ)లతో కలిసి కూటమిని ఏర్పాటు చేస్తున్నట్టు తేజ్ప్రతాప్ ప్రకటించారు.
రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని తిరునల్వేలి సభలో మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో, రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధపడుతున్నాయి.
అన్నాడీకేకు కులమతాల పట్టింపులేదని, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందించాలన్నదే తమ పార్టీ లక్ష్యమని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో చేపట్టిన తన ప్రచార యాత్రలో భాగంగా ఈపీఎస్ శుక్రవారం తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి నియోజకవర్గంలో పర్యటించారు.
డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం (ఓపీఎస్) గురువారం రెండుసార్లు కలుసుకుని రాజకీయ కలకలం సృష్టించారు. ఉదయం అడయార్ కళాక్షేత్ర ప్రాంతంలో స్టాలిన్ వాకింగ్కు వెళ్తుండగా ఓపీఎస్ తారసపడ్డారు. ఇద్దరూ ఐదు నిమిషాలపాటు ఆప్యాయంగా పలుకరించుకున్నారు.