Share News

Bihar Polls: సీట్ల పంపకాలపై అమిత్‌షా కీలక సమావేశం

ABN , Publish Date - Sep 03 , 2025 | 05:47 PM

బిహార్‌లో ఎన్డీయే భాగస్వాములుగా BJP, నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యునైటెడ్ (JD-U), చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), జితిన్ రామ్ మాంఝీ హిందుస్తాని అవావీ మోర్చా (సెక్యులర్), ఉపేంద్ర కుష్వాహకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్‌డీ) ఉన్నాయి.

Bihar Polls: సీట్ల పంపకాలపై అమిత్‌షా కీలక సమావేశం

న్యూఢిల్లీ: త్వరలో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలను (Bihar Polls) దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్రం హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) బుధవారంనాడు కీలక సమావేశం జరిపారు. ఈ సమవేశంలో బిహార్ ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఎన్నికల్లో సీట్ల పంపకాల ఫార్ములాను ఎన్డీయే ఇంకా ఖరారు చేయకపోవడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.


బిహార్‌లో ఎన్డీయే భాగస్వాములుగా BJP, నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యునైటెడ్ (JD-U), చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), జితిన్ రామ్ మాంఝీ హిందుస్తాని అవావీ మోర్చా (సెక్యులర్), ఉపేంద్ర కుష్వాహకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్‌డీ) ఉన్నాయి.


సంక్లిష్టమే..

2020 బిహార్ ఎన్నికల్లో జేడీయూపై చిరాగ్ పాశ్వన్ ఎల్జేడీ తమ అభ్యర్థులను నిలబెట్టింది. అయితే ఈసారి చిరాగ్ పార్టీ అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీయేకు భాగస్వామిగా ఉంది. ఇందువల్ల గత ఎన్నికల్లో తరహా నిర్ణయం తీసుకోలేదు. ఈ ఎన్నికల్లో 40 సీట్లను ఎల్జేపీ కోరుకుంటున్నప్పటికీ అది సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న మాంఝీ తమ హెచ్ఏఎం (సెక్యూలర్) పార్టీ 35-40 సీట్లలో పోటీ చేస్తుందని గత ఏప్రిల్‌లో బహిరంగంగా ప్రకటించారు. 243 మంది సభ్యుల అసెంబ్లీలో తమ సభ్యులు కనీసం 20 మంది ఉండేలా చూసుకుంటామన్నారు.


ఇక, 2020 ఎన్నికల్లో జేడీయూకు 15.39 శాతం ఓట్ షేర్ పడిపోయింది. అయినప్పటికీ 100 సీట్లలో పోటీ చేయాలని జేడీయూ పట్టుదలగా ఉంది. ఆర్ఎల్ఎం సైతం మరిన్ని సీట్లు ఆశిస్తోంది. ఇది ఎన్డీయే సీట్ల షేరింగ్‌ ప్రక్రియను మరింత సంక్లిష్టం చేసే అవకాశాలున్నాయి.


2020 ఎన్నికల్లో సీట్ల షేరింగ్ ఫార్మలా ఇదే..

2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లలో పోటీ చేసి 74 సీట్లు గెలుచుకుంది. జేడీయూ 115 సీట్లలో నిలబడి 43 చోట్ల గెలిచింది. ఎల్జేపీ 135 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసింది. ప్రధానంగా జేడీయూపై అభ్యర్థులను నిలబెట్టింది. అయితే కేవలం ఒకే ఒక్క సీటుని ఎల్జేపీ గెలుచుకుంది. కనీసం 30 చోట్ల జేడీయూ గెలుపు అవకాశాలను ఎల్జేపీ గండికొట్టిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. హెచ్ఏఎం (సెక్యూలర్) 7 సీట్లలో పోటీచేసి 4 గెలుచుకుంది. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) 11 స్థానాల్లో పోటీ చేసి 4 నియోజకవర్గాల్లో గెలిచింది.


ఇవి కూడా చదవండి..

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన టీఆర్ఎఫ్‌కు నిధులు అందించినది వీరే

యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో జవాన్ల సాహసాలను సువర్ణాక్షరాలతో లిఖించాలి

For More National News And Telugu News

Updated Date - Sep 03 , 2025 | 05:47 PM