Home » Assembly elections
జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రహ్మత్ నగర్ డివిజన్ పరిధిలోని వివిధ బస్తీల్లో రూ.4.62 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీరు, డ్రైనేజీ పనులను బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈవీఎం బ్యాలెట్ పేపర్లు మరింత సులువుగా చదివేందుకు వీలుగా ఉండేలా నిబంధనలను ఈసీఐ సవరించింది. తొలిసారి ఈవీఎంలపై గుర్తులతోపాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా ఉండబోతున్నాయి.
ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అధికారం చేపడితే.. ఢిల్లీ పీఠాన్ని సులువుగా హస్తగతం చేసుకోవచ్చనే ఒక ప్రచారం చాలా కాలంగా ఉంది. మరి కొద్ది నెలల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కూటమిలో కొత్త పార్టీల చేరిక తదితర అంశాలపై మంగళవారం జరిగిన బీజేపీ చింతనా సమావేశంలో పార్టీ నేతలు సమీక్ష జరిపారు. మహాబలిపురం సమీపంలోని ఓ హాలులో ఏర్పాటైన ఈ సమావేశానికి బీజేపీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పీఎల్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ రోజుకు రెండు జిల్లాల్లో మాత్రమే ప్రచారం చేయనున్నారు. గతంలో విజయ్ పర్యటన కోసం తయారు చేసిన రూట్మ్యా్పలో స్వల్పమార్పులు చేపట్టినట్లు ఆ పార్టీ నిర్వాహకులు తెలిపారు.
జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికలు సజావుగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉండాలని నోడల్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు.
తన పర్యటనలకు జనం అధిక సంఖ్యలో రావాలనే ఆలోచనతోనే తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్ వారంతపు సెలవుదినాల్లో ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి విమర్శించారు.
రాష్ట్రంలోని ద్రావిడ తరహా డీఎంకే ప్రభుత్వం ఓట్ల కోసం పథకాలను అమలు చేయడం లేదని, అన్ని వర్గాలవారు అన్ని సదుపాయాలు పొందాలనే లక్ష్యంతోనే కొత్త పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే నాయకులు, కార్యకర్తలను నియోజకవర్గంలో మోహరించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ శాసనసభ స్థానం ఖాళీ అయింది.
అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఎలాంటి విభేదాలు లేకుండా పటిష్ఠంగా ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పయనిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ మరోమారు స్పష్టంచేశారు.