Home » Assembly elections
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలను నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ సోమవారంనాడు పూర్తి చేసింది. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి, బీజేపీ ఎన్నికల ఇన్చార్జి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో సీట్ల పంపకాలు ఖరారయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు ఉచిత ప్రసార సమయం కోసం డిజిటల్ వోచర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.
అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీకి కాంగ్రెస్, రాహుల్ గాంధీ బి-టీమ్ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ జారీ చేసింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రామాణిక వసతులు కల్పించాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది.
పుదుచ్చేరిలో సిట్టింగ్ మంత్రులు, కీలక నేతలకు మరోసారి అవకాశం కల్పించడం ద్వారా 'ప్రో-ఇంకంబెన్సీ'ని వాడుకోవాలని బీజేపీ చూస్తోంది. అటు కేరళలో సినీ నటులు (వివేక్ గోపన్), సామాజిక సమీకరణలతో అభ్యర్థులను ఎంపిక చేయడం విశేషం.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లలో పోటీ చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ తెలిపారు. ఐదు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అరివాలయంలో డీఎంకే ఆశావహుల వద్ద ఉత్సాహభరితంగా ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర ప్రజలు ఢిల్లీ అధిపత్య కూటమిని అంగీకరించరని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరో కొత్త పొత్తు తెరపైకి వచ్చింది. ఎన్నికల వేళ 'ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం' పార్టీని స్థాపించిన వీకే శశికళ తాజాగా ఎస్.రామదాస్ సారథ్యంలోని పాట్టాలి మక్కల్ కట్చితో పొత్తు పెట్టుకున్నారు.
గత ఐదేళ్ల డీఎంకే పాలనలో మహిళలకు భద్రతలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాల్లో ముగ్గురు మాజీమంత్రులు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు.