Home » Assembly elections
తన పర్యటనలకు జనం అధిక సంఖ్యలో రావాలనే ఆలోచనతోనే తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్ వారంతపు సెలవుదినాల్లో ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి విమర్శించారు.
రాష్ట్రంలోని ద్రావిడ తరహా డీఎంకే ప్రభుత్వం ఓట్ల కోసం పథకాలను అమలు చేయడం లేదని, అన్ని వర్గాలవారు అన్ని సదుపాయాలు పొందాలనే లక్ష్యంతోనే కొత్త పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే నాయకులు, కార్యకర్తలను నియోజకవర్గంలో మోహరించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ శాసనసభ స్థానం ఖాళీ అయింది.
అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఎలాంటి విభేదాలు లేకుండా పటిష్ఠంగా ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పయనిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ మరోమారు స్పష్టంచేశారు.
స్టాలిన్ అంటేనే ‘మేన్ ఆఫ్ స్టీల్’ అనేలా తాను తీసుకునే నిర్ణయాలన్నీ దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే విధంగానే ఉంటాయని, అంతే కాకుండా కార్యసాధనలో తనకు పట్టుదల ఎక్కువేనని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు.
‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నాయకుడు, ప్రముఖ సినీనటుడు విజయ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 13 నుంచి రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు విజయ్ పర్యటనకు భద్రత కల్పించాలని కోరుతూ టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ ఇటీవల డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని, అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం వెంగళరావునగర్ డివిజన్లో రూ.5.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
తాము అధికారంలోకి వస్తే డీఎంకే ప్రభుత్వం నిలిపేసిన పథకాలను మళ్లీ ప్రారంభిస్తామని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. కోవై జిల్లా పొల్లాచ్చి అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో కుల సంఘాల ప్రతినిధులు, రైతులు, నేత కార్మికులు, పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు.
సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో తమ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలే లేవని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై స్పష్టం చేశారు. పార్టీపరంగా రెండు మహానాడులు నిర్వహించి జనసమీకరణ చేసినంత మాత్రాన ఆ జనం టీవీకేకు ఓట్లు వేస్తారనే గ్యారెంటీ లేదని, జనాన్ని చూసి విజయ్ మోసపోకూడదన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకూ ‘విశ్రాంతి’ అనే మాట మరిచి, పార్టీ కోసం ముమ్మరంగా ప్రచారం చేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని జిల్లా కార్యదర్శులకు డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు.